News April 4, 2025

MNCL: డిగ్రీ విద్యార్థులకు GOOD NEWS

image

కాకతీయ యూనివర్సిటీ పరిధిలో డిగ్రీ 2, 4, 6 సెమిస్టర్ల పరీక్ష ఫీజు చెల్లింపు గడువును KU అధికారులు పొడిగించిన విషయం తెలిసిందే. కాగా వీటితో పాటు 1, 3, 5 సెమిస్టర్ పరీక్షలు సైతం రాసేందుకు అవకాశం కల్పించినట్లు KU అధికారులు వెల్లడించారు. ఈ నేపథ్యంలో 1, 3, 5 పరీక్ష ఫీజును ఎలాంటి అపరాధ రుసుము లేకుండా ఈనెల 11 వరకు చెల్లించవచ్చని పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.

Similar News

News April 10, 2025

నేడు భారత్‌కు ముంబై దాడుల సూత్రధారి!

image

ముంబై ఉగ్రదాడుల్లో ప్రధాన సూత్రధారిగా వ్యవహరించిన తహవూర్ రాణాను నేడు భారత్‌కు తీసుకురానున్నారు. అమెరికా అధికారుల నుంచి అతడిని అదుపులోకి తీసుకున్న భారత అధికారులు ప్రత్యేక విమానంలో తరలిస్తున్నారు. ఈరోజు ఉదయం ఢిల్లీలో దిగే అవకాశం ఉంది. అనంతరం NIA రాణాను తమదైన శైలిలో లోతుగా విచారించనుంది. 26/11 ముంబై దాడుల్లో 166 మందిని రాణా సహా ఉగ్రవాదులు పొట్టనబెట్టుకున్నారు.

News April 10, 2025

సుస్థిర అభివృద్ధిలో బండపల్లికి రాష్ట్రంలో పదోర్యాంక్

image

చందుర్తి మండలం బండపల్లి గ్రామపంచాయతీ 80.41 మార్కులతో రాష్ట్రంలో అభివృద్ధిలో ఏ గ్రేడులో ముందు వరుసలో నిలిచింది. ఈ సందర్భంగా పంచాయతీ కార్యదర్శి మాట్లాడుతూ.. పంచాయతీలలో మౌలిక వసతుల పెంపు కోసం, ప్రజల సౌకర్యాలు కల్పన కోసం నిరంతరం కృషి చేస్తున్నామన్నారు. తాజాగా కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన జాబితాలో తాను పనిచేసే బండపల్లి గ్రామం రాష్ట్రంలో 10వ ర్యాంకు సాధించడం సంతోషంగా ఉందన్నారు.

News April 10, 2025

కంచ గచ్చిబౌలికి నేడు ‘సుప్రీం’ కమిటీ సందర్శన

image

TG: సుప్రీం కోర్టు నియమించిన పర్యావరణ అటవీ శాఖ సాధికారిక కమిటీ నేడు కంచ గచ్చిబౌలి భూముల్ని సందర్శించనుంది. నిన్న రాత్రి ఢిల్లీ నుంచి నగరానికి వచ్చిన కమిటీ సభ్యులు తాజ్ కృష్ణలో బసచేశారు. ఈరోజు ఉదయం 10గంటలకు వీరు హెచ్‌సీయూకు చేరుకోనున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు ప్రభుత్వాధికారులతో కమిటీ సమావేశం కానుంది.

error: Content is protected !!