News August 19, 2025
MNCL: ‘నవరాత్రి ఉత్సవాలు ప్రశాంతంగా జరిగేలా చర్యలు’

వినాయకచవితి, దుర్గాదేవీ నవరాత్రి ఉత్సవాలు ప్రశాంతంగా జరిగేలా విద్యుత్ శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని ఎన్పీడీసీఎల్ సీఅండ్ ఎండీ కర్నాటి వరుణ్ రెడ్డి ఆదేశించారు. మంగళవారం 16 సర్కిళ్ల ఎస్ఈ, డీఈలతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడారు. వినాయక విగ్రహాల తయారీ కేంద్రాలను సందర్శించాలని, ఎత్తు విగ్రహాల తరలింపు సమయంలో విద్యుత్ తీగలకు తగలకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
Similar News
News August 20, 2025
అన్నమయ్య: మన యశ్వంత్కు రూ.2.5కోట్ల జీతం

అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరుకు చెందిన యువకుడు రూ.కోట్లలో జీతం సంపాదిస్తున్నాడు. పట్టణంలోని సూర్యానగర్కు చెందిన యశ్వంత్ ఖరగ్పూర్ IITలో బీటెక్ చదివాడు. అక్కడ క్యాంపస్లో ఉన్నప్పుడే ఏడాదికి రూ.కోటి జీతంతో అమెరికాకు చెందిన ఓ ఏఐ కంపెనీలో చేరాడు. ఏఐపై మరింత పట్టుసాధించడంతో కాలిఫోర్నియాకు చెందిన మరో కంపెనీ ఏడాదికి రూ.2.5 కోట్ల జీతంతో అతడిని చేర్చుకుంది.
News August 20, 2025
GNT: వరద ఎఫెక్ట్.. ఆందోళనలో రైతులు

భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో ఉమ్మడి గుంటూరు జిల్లా రైతులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. ఇప్పటికే కృష్ణా డెల్టా పరిధిలో సుమారు 70 వేల ఎకరాల్లో వరితో పాటు పలు పంటలు దెబ్బతిన్నాయని అంచనా. ఎగువున డ్యాముల నుంచి నీరు విడుదల పెరగడంతో అమరావతి, తుళ్లూరు, తాడేపల్లి, తెనాలి, కొల్లిపర మండలాల్లో పంట నష్టం మరింత పెరిగే అవకాశం ఉంది.
News August 20, 2025
GNT: 2nd ఛాన్స్.. నేటితో లాస్ట్

ఉచిత విద్యాహక్కు చట్టం-2009 కింద ప్రైవేట్ పాఠశాలల్లో ఒకటో తరగతి ప్రవేశాలకు పాఠశాల విద్యాశాఖ అదనపు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈనెల 20 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆసక్తి ఉన్నవారు http://cse.ap.gov.in వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని అధికారులు తెలిపారు. ఇప్పటికే మేలో ఒకసారి నోటిఫికేషన్ జారీ చేశారు.