News November 4, 2025

MNCL: నేటి నుంచి చేప పిల్లలు విడుదల

image

మంచిర్యాల జిల్లాలో నేటి నుంచి చేప పిల్లల విడుదలకు అన్ని ఏర్పాట్లు చేశారు. జిల్లా వ్యాప్తంగా 380 చెరువులు, కుంటలు, రిజర్వాయర్లలో 2.23 కోట్ల చేప పిల్లలు విడుదల చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇందులో 35 నుంచి 40 మిల్లీమీటర్ల పరిమాణం గల 115.65 లక్షలు, 80 నుంచి 100 మిల్లీమీటర్ల పరిమాణం గల 108.28 లక్షల చేప పిల్లలు విడుదల చేయనున్నారు.

Similar News

News November 4, 2025

వరి, మొక్కజొన్నలో విత్తనశుద్ధి ఎలా చేయాలి?

image

☛వరి: పొడి విత్తనశుద్ధిలో కిలో విత్తనానికి 3 గ్రాముల కార్బెండజిమ్ కలిపి 24 గంటల తర్వాత నారుమడిలో చల్లుకోవాలి. అదే దమ్ము చేసిన నారుమడికైతే లీటరు నీటికి 1 గ్రాము కార్బెండజిమ్ మందు కలిపిన ద్రావణంలో విత్తనాలను 24 గంటలు నానబెట్టి మండె కట్టి నారుమడిలో చల్లాలి.
☛ మొక్కజొన్న: కిలో విత్తనానికి 3 గ్రాముల మాంకోజెబ్ మందుతో విత్తనశుద్ధి చేయడం వల్ల మొదటి దశలో వచ్చే తెగుళ్ల నుంచి మొక్కజొన్న పంటను కాపాడుకోవచ్చు.

News November 4, 2025

సీఎంఆర్‌ డెలివరీలో పెద్దపల్లి రికార్డు

image

2024-25 ఖరీఫ్ సీజన్‌కు సంబంధించిన పెండింగ్‌ సీఎంఆర్ రైస్ (కస్టమ్ మిల్లింగ్ రైస్) డెలివరీని NOV 8 నాటికి పూర్తిచేయాలని PDPL కలెక్టర్ కోయ శ్రీహర్ష అధికారులను, మిల్లర్లను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లో సమీక్ష నిర్వహించారు. 99.5% డెలివరీతో పెద్దపల్లి జిల్లా రాష్ట్రంలోనే మొదటి స్థానంలో ఉందని ఆయన తెలిపారు. మిగిలిన రైస్‌ను గడువులోగా పంపిణీ చేయాలని, రబీ సీజన్‌కు కూడా సిద్ధం కావాలని కలెక్టర్ సూచించారు.

News November 4, 2025

ధాన్యం సేకరణకు సిద్ధంగా ఉండండి: VZM JC

image

జిల్లాలో 4 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణకు యంత్రాంగం సిద్ధంగా ఉండాలని JC సేథుమాధవన్ పేర్కొన్నారు. అధికారులతో మంగళవారం సమీక్ష నిర్వహించారు. కామన్ వెరైటీకి క్వింటాకు రూ.2369, గ్రేడ్-ఏ రూ.2389 మద్దతు ధరగా నిర్ణయించారని తెలిపారు. విజయనగరం జిల్లాలో 382 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. జిల్లాకు ఒక కోటి గోనె సంచులు అవసరం అవుతాయని, 50 లక్షల గోన్లు అందుబాటులో ఉన్నాయన్నారు.