News March 2, 2025

MNCL: పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలి: డీఈవో

image

జిల్లాలో పదో తరగతి వార్షిక పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలని మంచిర్యాల డీఈఓ యాదయ్య సూచించారు. శనివారం ఎంఈఓలు, చీఫ్ సూపరింటెండెంట్లు, డెపార్ట్మెంట్ అధికారులు, రూట్ అధికారులకు నిర్వహించిన శిక్షణా కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ నెల 21 నుంచి ఏప్రిల్ 4 వరకు ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.30 వరకు పరీక్షలు జరుగుతాయని, పరీక్ష కేంద్రాల్లో ఎలాంటి లోటుపాట్లు లేకుండా చూడాలన్నారు.

Similar News

News October 28, 2025

మహా ప్రస్థానంలో సత్యనారాయణ రావు అంత్యక్రియలు పూర్తి

image

మాజీమంత్రి హరీశ్ రావు తండ్రి సత్యనారాయణ రావు అంత్యక్రియలు పూర్తయ్యాయి. కోకాపేటలోని ఆయన నివాసం నుంచి అంతిమయాత్ర ప్రారంభమై.. మహా ప్రస్థానం వద్ద ముగిసింది. అంతిమయాత్రలో మాజీమంత్రి కేటీఆర్‌తో పాటు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. కార్యకర్తల కన్నీటి వీడుకోలు మధ్య సత్యనారాయణ రావు అంత్యక్రియలు పూర్తయ్యాయి. హరీశ్ రావు తన తండ్రి సత్యనారాయణ రావు చితికి నిప్పంటించి, దహన కార్యక్రమాలు పూర్తి చేశారు.

News October 28, 2025

పంట నష్టాన్ని రైతులు నమోదు చేసేలా యాప్‌లో మార్పులు: CM CBN

image

AP: పంట నష్టాన్ని రైతులు పంపేలా వ్యవసాయశాఖ యాప్‌‌ను మార్చాలని CM CBN ఆదేశించారు. పంట నష్టం సహ వర్షాన్ని అంచనా వేస్తూ లోతట్టు ప్రాంతాల వారిని అప్రమత్తం చేయాలన్నారు. ‘కాకినాడకు మరిన్ని రెస్క్యూ బృందాలు పంపాలి. సీమలో వర్షాలు లేనందున చెరువుల్లో నీటిని నింపాలి’ అని సూచించారు. 43వేల హెక్టార్ల పంట నీట మునిగిందని అధికారులు నివేదించారు. 81 టవర్లతో వైర్‌లెస్ సిస్టమ్, 2703 జనరేటర్లు రెడీ చేశామన్నారు.

News October 28, 2025

పల్నాడు: అధికారులతో కలెక్టర్ టెలి కాన్ఫరెన్స్

image

భారీ వర్షాల నేపథ్యంలో రిజర్వాయర్లు, చెరువుల్లోని నీటిమట్టాలపై అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ కృత్తికా శుక్ల ఆదేశించారు. వర్షాల కారణంగా తలెత్తే పరిస్థితులను ఎదుర్కొనే సహాయక చర్యలు, సంసిద్ధతపై అధికారులతో టెలికాన్ఫరెన్స్ ద్వారా ఆమె సమీక్షించారు. సహాయక చర్యలపై ప్రత్యేక దృష్టి సారించాలని అన్ని శాఖల అధికారులను అప్రమత్తం చేశారు. జిల్లాలో ఎటువంటి ఆస్తి, ప్రాణ, పంట నష్టం జరగకుండా చూడాలని ఆదేశించారు.