News April 6, 2024
MNCL: ముందస్తు ఇంటి పన్ను చెల్లింపుపై 5 శాతం రాయితీ

రాష్ట్ర ప్రభుత్వం 2024-25 ఆర్థిక సంవత్సరంలో ఎర్లీ బర్డ్ స్కీమ్ కింద ముందస్తు ఇంటి పన్ను చెల్లింపుపై 5 శాతం రాయితీ కల్పించినట్లు మంచిర్యాల మున్సిపాలిటీ కమిషనర్ మారుతీ ప్రసాద్ తెలిపారు. ఏప్రిల్ 1 నుంచి 31 మార్చి 2025 వరకు ఇంటి పన్ను మొత్తం ఈ నెల 30లోపు ముందస్తుగా చెల్లించి 5 శాతం రాయితీ పొందాలని సూచించారు. ఈ అవకాశాన్ని పట్టణ ప్రజలు సద్వినియోగం చేసుకొని అభివృద్ధికి తోడ్పడాలని కోరారు.
Similar News
News December 22, 2025
మంత్రి జూపల్లి కృష్ణారావును కలిసిన జోగు రామన్న

ఆదిలాబాద్ ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావును సోమవారం హైదరాబాద్లోని సెక్రటేరియట్లో మాజీ మంత్రి జోగురామన్న కలిశారు. గత ప్రభుత్వ హయాంలో మొదలుపెట్టి పెండింగ్లో ఉన్న అభివృద్ధి పనులను పూర్తిచేయాలని కోరారు. అదేవిధంగా చనాక కొరాట ప్రాజెక్టుకు సంబంధించి పనులను త్వరగా పూర్తయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని విన్నవించినట్లు జోగురామన్న తెలిపారు.
News December 21, 2025
ఆదిలాబాద్: సోమవారం ప్రజావాణి యథాతథం

ఈ సోమవారం (22 వ తేదీ) నుంచి ప్రజావాణి కార్యక్రమం యథావిధిగా కొనసాగుతుందని జిల్లా కలెక్టర్ రాజర్షి షా తెలిపారు. గ్రామపంచాయతీ ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలులో ఉన్నందున ఇన్ని రోజులు వాయిదా పడిన ప్రజావాణి కార్యక్రమం సోమవారం నుంచి తిరిగి ప్రారంభమవుతుందన్నారు. ప్రజలు ఎవరైనా తమ సమస్యల గురించి దరఖాస్తులు ఇవ్వదలుచుకుంటే ఈ విషయాన్ని గమనించాలని సూచించారు.
News December 20, 2025
బ్లాక్ మెయింగ్కి పాల్పడితే సంప్రదించండి: ADB SP

మహిళలకు గతంలో జరిగిన వాటిని అడ్డుగా పెట్టుకుని బ్లాక్మెయిలింగ్ పాల్పడుతున్న సందర్భాలలో నిర్భయంగా షీ టీం బృందాన్ని సంప్రదించవచ్చని SP అఖిల్ మహాజన్ పేర్కొన్నారు. గతంలో ప్రేమించి, ప్రస్తుతం ఆ యువకులచే వేధింపబడుతున్న మహిళలు నిర్భయంగా సంప్రదించాలని సూచించారు. షీ టీం అండగా ఉంటూ సహాయాన్ని అందజేస్తుందని హామీ ఇచ్చారు. ఆపద వస్తే 8712659953 నంబర్కు సంప్రదించాలన్నారు.


