News January 23, 2025
MNCL: రాష్ట్ర ప్రెస్ అకాడమీ ఛైర్మన్కు సన్మానం

తెలంగాణ రాష్ట్ర ప్రెస్ అకాడమీ ఛైర్మన్ శ్రీనివాస్రెడ్డిని బుధవారం సాయంత్రం మంచిర్యాల కేంద్రంలో జన్నారం మండల టీయూడబ్ల్యూజే(ఐజేయూ) ప్రతినిధులు సత్కరించారు. సత్కరించిన వారిలో మండల జర్నలిస్టులు నరసయ్య, మల్లేశం, లింగన్న, కిరణ్, వెంకటయ్య, సతీష్, రాజేందర్, శంకర్ తదితరులు ఉన్నారు.
Similar News
News November 9, 2025
కేసీఆర్ తెచ్చిన ఏ పథకాన్నీ రద్దు చేయలేదు: CM రేవంత్

TG: KCR తెచ్చిన ఏ పథకాన్నీ తాను రద్దు చేయలేదని, వాటికి అదనంగా మరిన్ని స్కీమ్స్ అమలు చేస్తున్నట్లు CM రేవంత్ తెలిపారు. నాడు అభివృద్ధిని పక్కనపెట్టి ఎలాంటి ప్రయోజనం లేని కమాండ్ కంట్రోల్ సెంటర్, సచివాలయం, ప్రగతిభవన్ మాత్రమే నిర్మించారని విమర్శించారు. ‘నేను SC వర్గీకరణ చేసిన తొలి రాష్ట్రంగా నిలిపాను. కులగణన చేసి చూపించా. రాష్ట్ర గీతాన్ని అందించా. మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించా’ అని రేవంత్ వివరించారు.
News November 9, 2025
మరికల్: వృథాగా భవనాలు.. వినియోగించుకుంటే లాభాలు

మరికల్ మండల కేంద్రంలో సహకార సంఘానికి సంబంధించిన సహకార భవనంతో పాటు గిడ్డంగి గత కొన్ని సంవత్సరాలుగా వృథాగా పడి ఉన్నాయి. వాటికి మరమ్మతులు చేసి వినియోగించుకుంటే భవనాలు వినియోగంలోకి వస్తాయి. అధికారులు నిర్లక్ష్యం వహిస్తుండడంతో ప్రభుత్వ కార్యాలయాలు కిరాయి భవనాల్లో కొనసాగించి వాటికి అద్దెలు చెల్లిస్తున్నారు. తాహశీల్దార్ కార్యాలయం కూడా వృథాగా ఉంది. వీటిలో ఉపయోగించుకుంటే ప్రభుత్వానికి లాభాలు వస్తాయి.
News November 9, 2025
మల్లె మొగ్గలను తొలిచే పురుగుల నివారణ ఎలా?

మల్లె తోటల్లో మొగ్గలను తొలిచి తినే పురుగు వల్ల పంటకు తీవ్ర నష్టం కలుగుతుంది. దీని నివారణకు 5 శాతం వేప కాషాయం లేదా థయోక్లోప్రిడ్ 21.7% S.C. 1ml లేదా క్లోరాంట్రనిలిప్రోల్ 18.5% S.C 0.3ml లేదా స్పైనోశాడ్ 45% ఎస్.సి. 0.3మి.లీ. లేదా క్వినాల్ ఫాస్ 25% ఇ.సి. 2మి.లీ.లలో ఏదైనా ఒకదానిని లీటరు నీటికి కలుపుకొని మొక్కలు పూర్తిగా తడిచేలా పిచికారీ చేయాలి. ఎకరానికి 6 నుంచి 8 చొప్పున లింగాకర్షణ బుట్టలు అమర్చాలి.


