News April 24, 2025
MNCL: ‘రెడ్డి సంక్షేమ సంఘాన్ని జిల్లాలో బలోపేతం చేస్తాం’

రెడ్డి సంక్షేమ సంఘాన్ని మంచిర్యాల జిల్లాలో బలోపేతం చేస్తామని రెడ్డి సంక్షేమ సంఘం మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు గుర్రం మోహన్ రెడ్డి అన్నారు. గురువారం మధ్యాహ్నం జిల్లాలోని మందమర్రి పట్టణానికి చెందిన కొంగల తిరుపతిరెడ్డిని, జిల్లా సంక్షేమ సంఘం ఉపాధ్యక్షులుగా నియమించినట్లు వారు తెలిపారు. వారికి నియామక పత్రాన్ని అందించారు. రెడ్డి నాయకులు అంతా ఐక్యంగా ఉండి తమ హక్కులను సాధించుకోవాలన్నారు.
Similar News
News April 24, 2025
NLG: రిసోర్స్ పర్సన్స్ కోసం దరఖాస్తుల ఆహ్వానం

ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల్లో ఉపాధ్యాయులకు శిక్షణ ఇచ్చేందుకు మండల, జిల్లా స్థాయి రిసోర్స్ పర్సన్ల కోసం అర్హత, ఆసక్తిగల ఉపాధ్యాయులు ఈ నెల 24న దరఖాస్తు చేసుకోవాలని డీఈఓ భిక్షపతి తెలిపారు. ఎంపికైన వారి వివరాలు ఈ నెల 28న ప్రకటిస్తామని పేర్కొన్నారు. వివరాలకు క్వాలిటీ కోఆర్డినేటర్ ఆర్.రామచంద్రయ్యను, సెల్ నంబర్ 79955 67558ను సంప్రదించాలని సూచించారు.
News April 24, 2025
విశాఖను అమ్మేస్తున్నారు: కేశినేని నాని

ఉర్సా క్లస్టర్ సంస్థలకు భూకేటాయింపులపై విజయవాడ మాజీ ఎంపీ కేశినేని నాని తాను చేసిన విమర్శలను సమర్ధించుకున్నారు. ఎవరు ఎన్ని జూమ్ మీటింగులు పెట్టి వివరణలు ఇచ్చినా “Vizag is for sale” అంటూ గురువారం నాని ట్వీట్ చేశారు. తనను ఎన్ని బూతులు తిట్టినా, చిప్ పోయిందని, సైకో అన్నా తనకు ఎలాంటి ప్రాబ్లమ్ లేదని.. విశాఖలో ఇటీవల జరిపిన భూకేటాయింపులు సక్రమంగా లేవని నాని ఆరోపించారు.
News April 24, 2025
భూపాలపల్లి జిల్లాలో 40 డిగ్రీలు దాటిన ఎండ

భూపాలపల్లి జిల్లాలో ఎండలు తీవ్రంగా మారాయి. ఇటీవల వర్షాలు కురిసినప్పటికీ, గురువారం ఉష్ణోగ్రత 40 డిగ్రీలను దాటింది. ఈ ఊహించని వేడిమి వల్ల మధ్యాహ్నం రోడ్లపై జనసంచారం ఆగిపోయింది. చాలా మంది వడదెబ్బకు గురై, ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ప్రజలు ఇంటిలోనే ఉండేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ అసాధారణ వాతావరణం ఇబ్బందులు కలిగిస్తోందని స్థానికులు తెలిపారు.