News December 30, 2025
MNCL: రేపు డీసీసీ సర్వసభ్య సమావేశం

కాంగ్రెస్ మంచిర్యాల జిల్లా సర్వసభ్య సమావేశం బుధవారం నిర్వహిస్తున్నట్లు డీసీసీ అధ్యక్షుడు పిన్నింటి రఘునాథరెడ్డి తెలిపారు. గద్దెరాగడిలోని భీమా గార్డెన్స్లో జరిగే ఈ సమావేశానికి రాష్ట్ర ఆయిల్ ఫెర్టిలైజర్ ఛైర్మన్ జంగా రాఘవ రెడ్డి, టీపీసీసీ కార్యదర్శులు రాంభూపాల్, రహమాతుల్లా హుస్సేన్ హాజరుకానున్నారని పేర్కొన్నారు. డీసీసీ కార్యవర్గం కోసం దరఖాస్తులు స్వీకరించనున్నట్లు చెప్పారు.
Similar News
News January 2, 2026
మొక్కజొన్నకు కత్తెర పురుగుతో తీవ్ర నష్టం.. నివారణ ఎలా?

మొక్కజొన్న తోటల్లో కత్తెర పురుగు ఉద్ధృతి పెరిగింది. ఇది మొక్క మొలక దశ నుంచే ఆశిస్తుంది. ఈ పురుగు లార్వాలు మొక్కజొన్న కాండం, ఆకులను తిని రంధ్రాలను చేస్తాయి. ఇవి పెరుగుతున్న కొద్దీ ఆకుల చివరల నుంచి కత్తిరించినట్లుగా పూర్తిగా తినేస్తాయి. ఆకు సుడులను కూడా తింటాయి. దీని వల్ల మొక్కకు తీవ్ర నష్టం జరిగి పంట దిగుబడి గణనీయంగా తగ్గుతుంది. కత్తెర పురుగు నివారణకు సూచనల కోసం <<-se_10015>>పాడిపంట<<>> క్లిక్ చేయండి.
News January 2, 2026
VZM: ఒక్కరోజే రూ.7.76 కోట్ల మద్యం ఫుల్గా తాగేశారు

విజయనగరం జిల్లాలో ఆబ్కారీ ఆదాయానికి 2026 సంవత్సరం ప్రారంభ రోజే కొత్త కిక్కునిచ్చింది. డిసెంబర్ 31న మందు బాబులు ఫుల్ జోష్ చేసుకున్నారు. ఏకంగా జిల్లాలో రూ.7.76 కోట్లు విలువ చేసే మద్యాన్ని తాగేశారు. గత ఏడాది రూ.5.27 కోట్ల ఆదాయం రాగా.. ఈ ఏడాది రూ.2.50 కోట్ల ఆదాయం పెరిగింది. డిసెంబర్ 31న వైన్, బార్ అండ్ రెస్టారెంట్స్లో అమ్మకాలకు 2 గంటల వరకు అదనంగా అనుమతులు ఇచ్చారు.
News January 2, 2026
ప.గో: దైవదర్శనం ముగించుకుని వస్తుండగా.. లారీ రూపంలో మృత్యువు!

తణుకు మండలం తేతలి జాతీయ రహదారిపై గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి చెందిన సంగతి <<18732182>>తెలిసిందే<<>>. తణుకు మండలం వేల్పూరుకి చెందిన అందే లోకేశ్వరరావు, అందే వెంకటలక్ష్మి (48) దంపతులు ద్వారకాతిరుమల, మద్ది ఆంజనేయస్వామి దర్శనం ముగించుకుని బైకుపై వస్తుండగా.. తేతలి జాతీయ రహదారిపై లారీ ఢీకొట్టింది. కళ్లముందే భార్య మరణించడంతో భర్త రోదనలు మిన్నంటాయి. పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.


