News January 24, 2025
MNCL: రేపు హ్యాండ్ బాల్ ఎంపికలు

మంచిర్యాల, ఆసిఫాబాద్ జిల్లా జిల్లాస్థాయి సబ్ జూనియర్ బాలుర హ్యాండ్ బాల్ ఎంపిక పోటీలను ఈనెల 25న ఆసిఫాబాద్ జిల్లాకేంద్రంలోని గిరిజన ఆదర్శ క్రీడా పాఠశాలలో నిర్వహించనున్నారు. ఈ విషయాన్ని ఉమ్మడి జిల్లా హ్యాండ్ బాల్ సంఘం అధ్యక్ష, ప్రధానకార్యదర్శులు శ్యాంసుందర్ రావు, కనపర్తి రమేష్ తెలిపారు. పోటీల్లో పాల్గొనే రెండు జిల్లాల క్రీడాకారులు ధ్రువపత్రాలతో ఉదయం10 గంటలకు హాజరుకావాలని సూచించారు.
Similar News
News September 14, 2025
MBNR: ఓపెన్ డిగ్రీ, PG.. గడువు పెంపు

బీఆర్ అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ యూజీ, పీజీలో అడ్మిషన్లకు ఈనెల 26 వరకు గడువు పొడిగించినట్లు ఉమ్మడి పాలమూరు జిల్లా ఓపెన్ యూనివర్సిటీ రీజినల్ కో-ఆర్డినేటర్ డాక్టర్ జి.సత్యనారాయణ గౌడ్ Way2Newsతో తెలిపారు. రెగ్యులర్గా కాలేజీకి వెళ్లి చదవలేని విద్యార్థులు, ఉద్యోగులకు ఓపెన్ యూనివర్సిటీ ఒక మంచి అవకాశం అని సూచించారు. పూర్తి వివరాలకు https://braou.ac.in వెబ్సైట్లో సందర్శించాలన్నారు. SHARE IT
News September 14, 2025
BJP భౌగోళికంగా విస్తరించాల్సి ఉంది: సత్యకుమార్

AP: డబుల్ ఇంజిన్ సర్కార్ వల్ల రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్నామని మంత్రి సత్యకుమార్ తెలిపారు. PVN మాధవ్ సారథ్య యాత్ర ముగింపు సందర్భంగా విశాఖలో ఏర్పాటు చేసిన సభలో మాట్లాడారు. ‘ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా APని తీర్చిదిద్దుతున్నాం. ఎన్నికల్లో ఇచ్చిన అన్ని హామీలను నెరవేరుస్తున్నాం. కేంద్రం, రాష్ట్రంలో సమర్థవంతమైన నాయకులు పరిపాలిస్తున్నారు. రాష్ట్రంలో భౌగోళికంగా BJP ఇంకా విస్తరించాల్సి ఉంది’ అని అన్నారు.
News September 14, 2025
సైబర్ మోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: SP

సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ అఖిల్ మహాజన్ ఆదివారం తెలిపారు. ఏదైనా సైబర్ మోసం జరిగిన వెంటనే టోల్ ఫ్రీ నంబర్ 1930కి ఫిర్యాదు చేయాలని సూచించారు. సైబర్ నేరగాళ్లు ప్రజల అత్యాశను ఆసరాగా చేసుకుని మోసాలకు పాల్పడుతున్నారని ఆయన అన్నారు. ఈ వారంలో మొత్తం 20 సైబర్ ఫిర్యాదులు నమోదయ్యాయని ఎస్పీ వెల్లడించారు.