News May 10, 2024

MNCL: రైలు కింద పడి సింగరేణి కార్మికుడి ఆత్మహత్య

image

మంచిర్యాలలోని హమాలివాడకు చెందిన ఊరుగొండ సాయికుమార్ అనే సింగరేణి కార్మికుడు గురువారం రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గత నెల 20న ఉద్యోగంలో చేరిన సాయికుమార్ గనిలో దిగాలంటే భయంగా ఉందని, ఉద్యోగం చేయలేనంటూనే వాడు. ఈ క్రమంలో గురువారం డ్యూటీకి వెళ్లిన సాయికుమార్ రైలు పట్టాలపై శవమై కనిపించడంతో కుటుంబ సభ్యులు బోరున విలపించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై సుధాకర్ తెలిపారు.

Similar News

News September 29, 2024

బాసర: నవరాత్రుల ఉత్సవాల్లో ఈ సేవలు రద్దు

image

బాసర అమ్మవారి ఆలయంలో దసరా నవరాత్రుల ఉత్సవాల్లో పలు సేవలు రద్దు చేసినట్లు ఆలయ అధికారులు తెలిపారు. అక్టోబర్ 3 నుంచి 11వరకు అభిషేకాలు, 9న అక్షరాభ్యాసం తప్ప మిగతా ఆర్జిత సేవలు రద్దు, 11 నుంచి 13 చండీహోమం, 12న ఉదయం 10 గం.ల వరకు అక్షరాభ్యాసములు రద్దు చేసినట్లు వెల్లడించారు. భక్తులు గమనించి సహకరించాలని కోరారు.

News September 29, 2024

ADB: దసరా స్పెషల్.. RTC ఆధ్వర్యంలో 412 ప్రత్యేక బస్సులు

image

దసరా సెలవుల నేపథ్యంలో ఆదిలాబాద్ రిజియన్‌లోని వివిధ డిపోల నుంచి 412 ప్రత్యేక బస్సులను JBS నుంచి ప్రత్యేకంగా నడుపుతున్నట్లు ఆదిలాబాద్ RTC RM సొలొమాన్ పేర్కొన్నారు. Oct 1 నుంచి 11 వరకు ఆదిలాబాద్ డిపో-78, అసిఫాబాద్-73, బైంసా-11, మంచిర్యాల-125, నిర్మల్-120, ఉట్నూర్-5 ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు పేర్కొన్నారు. ఈ ప్రత్యేక బస్సులు OCT 1 నుంచి OCT 11 వరకు నడుస్తాయని పేర్కొన్నారు.

News September 29, 2024

మరాఠీ పాటల పోటీలలో రాణిస్తున్న ముధోల్ చిన్నారి

image

ముధోల్ మండల కేంద్రానికి చెందిన గడపాలె అంజలి ప్రముఖ మరాఠీ ఛానల్లో నిర్వహిస్తున్న “మీ హోణార్ సూపర్ స్టార్ చోటే ఉస్తాద్ సీజన్-3” సింగింగ్ షోలో అద్భుతంగా పాటలు పాడుతూ సెమీఫైనల్‌కు చేరుకుంది. ఈ సందర్భంగా చిన్నారి చదువుతున్న పాఠశాల ప్రిన్సిపల్ ఆసంవార్ సాయినాథ్ అభినందించారు. ఆయన మాట్లాడుతూ తమ పాఠశాల విద్యార్థి పాటల్లో రాణిస్తూ సెమీ ఫైనల్‌కు చేరుకోవడం ఎంతో ఆనందంగా ఉందన్నారు.