News March 13, 2025
MNCL: వరకట్న వేధింపులు.. ఇద్దరిపై కేసు: CI

వరకట్న వేధింపుల కేసులో ఇద్దరిపై కేసు నమోదు చేసినట్లు మంచిర్యాల మహిళా పోలీస్ స్టేషన్ సీఐ నరేశ్ కుమార్ తెలిపారు. జిల్లాకేంద్రంలో హమాలివాడకు చెందిన ముత్యాల స్వాతికి విద్యుత్ శాఖలో ఏఈగా పనిచేసే కాగజ్నగర్కు చెందిన రాంప్రసాద్తో 2011 మార్చి 24న వివాహం జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. అదనపు కట్నం కోసం భర్తతో పాటు ఆడపడుచు సరోజ వేధించడంతో స్వాతి ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేశారు.
Similar News
News March 14, 2025
నల్గొండ: ఈనెల 17, 18 తేదీల్లో కలెక్టరేట్ ఎదుట అంగన్వాడీల వంటా వార్పు

రాష్ట్రవ్యాప్తంగా అంగన్వాడీలు ఎదుర్కొంటున్న సమస్యలపై ఈనెల 17, 18 తేదీల్లో జిల్లా వ్యాప్తంగా అంగన్వాడీలు కలెక్టరేట్ ఎదుట వంట వార్పు నిరసన కార్యక్రమాన్ని నిర్వహిస్తామని సిఐటీయూ జిల్లా నాయకులు అవుటు రవీందర్ తెలిపారు. తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ & హెల్పర్స్ యూనియన్ సీఐటీయూ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సమస్యలతో కూడుకున్న మెమోరాండం నల్గొండ జిల్లా కార్యాలయంలో సమర్పించారు.
News March 14, 2025
టెన్త్ ఎగ్జామ్స్..ఎలా చదువుతున్నారు: కలెక్టర్

పదవ తరగతి పరీక్షలు దగ్గర పడ్డాయని, కష్టపడి చదువుకుంటే మంచి మార్కులు వస్తాయని కలెక్టర్ వల్లూరు క్రాంతి అన్నారు. కొండాపూర్ కస్తూర్బా పాఠశాలను గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పదవ తరగతి విద్యార్థులు ఎలా చదువుతున్నారు అడిగి తెలుసుకున్నారు. ఆమె మాట్లాడుతూ.. విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకొని చదివించాలని ఉపాధ్యాయులకు సూచించారు. మండల విద్యాధికారి దశరథ్ పాల్గొన్నారు.
News March 14, 2025
వర్గల్: రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తి మృతి

వర్గల్ మండలం గౌరారం రాజీవ్ రహదారిపై ఈనెల 10న జరిగిన రోడ్డు ప్రమాదంలో గౌరారంలో నివాసం ఉంటున్న దుర్గాప్రసాద్ (28) అనే వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స కోసం ఆర్వీఎం ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ గురువారం మృతి చెందాడు. మృతుడు దుర్గాప్రసాద్కు భార్య, రెండు సంవత్సరాల కూతురు, రెండు నెలల బాబు ఉన్నారు.