News August 28, 2025
MNCL: వరద ఎఫెక్ట్.. ఆసుపత్రి పేషంట్ల తరలింపు

గోదావరి ప్రవాహం గంటగంటకు పెరిగిపోతూ వరద లోతట్టు ప్రాంతాలకు చేరుతుండగా తదితరులు ముందస్తు జాగ్రత్తలు చేపట్టారు. మాతాశిశు ఆసుపత్రి నుంచి పేషంట్లను ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలిస్తున్నారు. గత సంవత్సరం ఆస్పత్రిలోకి వరద నీరు చేరిన విషయం తెలిసిందే. ఎల్లంపల్లి గేట్లు ఎత్తివేయడంతో గోదావరి ప్రవాహం ఉదృతంగా సాగుతోంది. రాళ్లవాగు నీరు పోటుకమ్ముతు లోతట్టు ప్రాంతాల్లోకి వెళ్తుంది.
Similar News
News August 28, 2025
ఎల్లంపల్లి: హరీశ్రావు, KTR చెప్పినట్లు చేస్తే అంతే ఇగ: CM

‘గోదావరి జలాలకు ఎల్లంపల్లి ప్రాజెక్టు గుండెకాయ, జంక్షన్ లాంటిది. సాంకేతిక సలహాలు తీసుకుని ప్రాజెక్టుకు రిపేర్ చేస్తాం. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్లను నాణ్యతా లోపంతో కట్టారు. అవి కూలుతాయని సాంకేతిక నిపుణులు చెబుతున్నారు. తామైతే లోపలికి వెళ్లి చూడలేదు. డిజైన్, నిర్మాణం, నిర్వహణలో లోపాలున్నాయని తెలిసింది. హరీశ్రావు, KTR చెప్పినట్లు చేస్తే ఊళ్లకు ఊళ్లు మునుగుతాయి’అని CM రేవంత్ రెడ్డి అన్నారు.
News August 28, 2025
GWL: నిబంధనలు ఉల్లంఘించిన వారికి జరిమానా

పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్లోని సీసీ కెమెరాల ద్వారా పర్యవేక్షణ చేసి ట్రాఫిక్ నియమాలు ఉల్లంఘించిన వారికి జరిమానా విధించాలని ఎస్పీ శ్రీనివాసరావు సూచించారు. గురువారం జిల్లా పోలీస్ కార్యాలయంలోని పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్లో సీసీ కెమెరాలు పనితీరును పరిశీలించారు. అక్కడ విసిబిల్ అవుతున్న వివరాలు, ట్రాఫిక్ నియమాలు ఉల్లంఘించిన వారికి విధించిన జరిమానా వివరాలను ఎస్పీకి సిబ్బంది వివరించారు.
News August 28, 2025
ఖమ్మం ఐటీ హబ్లో ఉచిత శిక్షణ

ఖమ్మం ఐటీ హబ్లో నిరుద్యోగ యువతకు ఉచితంగా శిక్షణ ఇస్తున్నట్లు ప్రాంతీయ కేంద్ర మేనేజర్ అశోక్ తెలిపారు.
శిక్షణ ఇచ్చే కోర్సులు:
HTML5, CSS3, JavaScript, Bootstrap 5
Java, Python
Database
Aptitude & Reasoning, Soft-Skills & IT-Skills
డిగ్రీ, ఇంజినీరింగ్, ఇతర కోర్సులు పూర్తి చేసిన అర్హులైన అభ్యర్థులు సెప్టెంబర్ 6లోగా ఐటీ హబ్లో రిజిస్టర్ చేసుకోవాలని సూచించారు. పూర్తి వివరాలకు నెం. 95025 05880.