News April 2, 2025
MNCL: వార్షిక బొగ్గు ఉత్పత్తి సాధనలో సింగరేణి సత్తా

సింగరేణి సంస్థ ప్రతి ఏడాది బొగ్గు ఉత్పత్తి లక్ష్యాలను పెంచుకుంటూ.. దానిని సాధిస్తూ మిగతా ఉత్పత్తి సంస్థలకు స్ఫూర్తిగా నిలుస్తోంది. అదే కోవలో 2024- 25 ఆర్థిక సంవత్సరంలో 72 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి లక్ష్యాన్ని సాధించి మరోసారి తన సత్తాను చాటుకుంది. ఇదే స్ఫూర్తితో 2025- 26 ఆర్థిక సంవత్సరంలో నిర్దేశించిన 76 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి లక్ష్య సాధనపై యాజమాన్యం దృష్టి సారించింది.
Similar News
News July 6, 2025
పాలమూరు: ఈ ఏడాది.. కొత్త స్కూళ్లు మంజూరు.!

ప్రభుత్వ స్కూళ్లపై ప్రభుత్వం ప్రత్యేక ఫోకస్ పెట్టింది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 8 ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు మంజూరయ్యాయి. అన్ని వసతులు కల్పిస్తూ ప్రారంభించేందుకు DEOలు సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే MBNR-9,917, NGKL-9,010, GDWL-7,205, NRPT-8,454, WNPT-8,103 మంది విద్యార్థులు కొత్త అడ్మిషన్లు అయ్యారు. తల్లిదండ్రులు ప్రైవేట్ స్కూల్లో కంటే ప్రభుత్వ బడిలో చేర్పించేందుకు ఆసక్తి చూపుతున్నారు.
News July 6, 2025
సామర్లకోట: యువకుడి హత్య.. నిందితుల అరెస్ట్

సామర్లకోట మండలంలో ఇటీవల చోటుచేసుకున్న యువకుడి హత్య కేసులో నిందితులను అరెస్ట్ చేసి న్యాయస్థానానికి అప్పగించినట్లు సీఐ కృష్ణ భగవాన్ శనివారం తెలిపారు. తొలుత మిస్సింగ్ కేసుగా నమోదు చేశామని, దర్యాప్తులో హత్యగా తేలిందని ఆయన వెల్లడించారు. నిందితులపై సెక్షన్ 103(1), 238(a) r/w 3(5) బీఎంఎస్ కింద కేసులు నమోదు చేశామని, దర్యాప్తు కొనసాగుతుందని సీఐ పేర్కొన్నారు.
News July 6, 2025
శంషాబాద్: రేపు పోస్ట్ ఆఫీస్ సేవలు నిలిపివేత

పోస్ట్ ఆఫీస్ సేవలను సోమవారం నిలిపివేస్తున్నట్లు సౌత్ ఈస్ట్ డివిజన్ సీనియర్ సూపరింటెండెంట్ హైమావతి తెలిపారు. వినియోగదారులకు మరింత వేగవంతమైన, సమర్థవంతమైన సేవలు అందించేందుకు తపాలా శాఖ పోస్టల్ టెక్నాలజీ ఐటీ 2.0ను ప్రవేశ పెడుతుంది. ఈనెల 8 నుంచి ఈ సేవలు అందుబాటులోకి వస్తాయని, ఇందులో భాగంగా రేపు పోస్టాఫీసుల్లో ఎలాంటి లావాదేవీలు జరగవని పేర్కొన్నారు.