News April 11, 2025

MNCL: సన్నబియ్యం పక్కదారి పట్టకుండా చర్యలు: కలెక్టర్

image

ప్రభుత్వం ఉచితంగా పంపిణీ చేస్తున్న సన్నబియ్యం పక్కదారి పట్టకుండా పటిష్ఠ చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ తెలిపారు. సన్నబియ్యం విక్రయించడం, కొనుగోలు చేయవద్దని, విక్రయిస్తే రేషన్ కార్డు రద్దుతో పాటు క్రిమినల్ కేసులు నమోదు చేయనున్నట్లు తెలిపారు. రేషన్ డీలర్లు అర్హులైన లబ్ధిదారులకు సన్న బియ్యం పంపిణీలో అక్రమాలకు పాల్పడితే లైసెన్స్ రద్దుతో పాటు క్రిమినల్ చర్యలు తీసుకుంటామన్నారు.

Similar News

News December 22, 2025

2024 నుంచే అమరావతికి చట్టబద్ధత: పెమ్మసాని

image

AP: రాష్ట్ర రాజధానిని భవిష్యత్‌లో ఎవరూ తరలించడానికి వీల్లేకుండా అమరావతికి చట్టబద్ధత కల్పించేందుకు కేంద్రం ఒప్పుకున్నట్లు కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. 2024 నుంచే చట్టబద్ధతను అమల్లోకి తీసుకొస్తామని కేంద్ర హోం మంత్రి అమిత్ షా హామీ ఇచ్చారని వెల్లడించారు. దీనిపై అటార్నీ జనరల్‌తోనూ చర్చించినట్లు వివరించారు. త్వరలోనే రాజధానికి పిన్ కోడ్, STD, ISD కోడ్‌లను మంజూరు చేయనున్నట్లు చెప్పారు.

News December 22, 2025

వణుకుతున్న సంగారెడ్డి జిల్లా

image

సంగారెడ్డి జిల్లాను చలి చుట్టేసింది. గత కొద్ది రోజులుగా ఉష్ణోగ్రతలు భారీగా పడిపోతున్నాయి. కోహిర్‌లో కనిష్ఠ ఉష్ణోగ్రత 5 డిగ్రీలకు చేరడంతో జనం గజగజ వణుకుతున్నారు. సత్వార్, మొగుడంపల్లి, దిగ్వాల్, నిజాంపేట వంటి ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 7-8 డిగ్రీల మధ్య నమోదయ్యాయి. సిర్గాపూర్, నాగల్‌గిద్ద, పుల్కల్, మల్చల్మాలోనూ ఇదే పరిస్థితి ఉంది. చలి తీవ్రతకు ప్రజలు ఇళ్లకే పరిమితమవుతున్నారు. ఉదయం మంచు కురుస్తోంది.

News December 22, 2025

మెదక్: నేడు కొత్త సర్పంచుల ప్రమాణ స్వీకారం

image

మెదక్ జిల్లాలోని 492 గ్రామ పంచాయతీల్లో సోమవారం నూతన పాలకవర్గాలు బాధ్యతలు స్వీకరించనున్నాయి. సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు సభ్యుల ప్రమాణ స్వీకారానికి పంచాయతీరాజ్ శాఖ ఏర్పాట్లు పూర్తిచేసింది. దీంతో ప్రత్యేక అధికారుల పాలన ముగిసింది. ఎన్నికలు జరగక నిలిచిన 15వ ఆర్థిక సంఘం నిధులు విడుదలయ్యే అవకాశం ఏర్పడింది. సుమారు రూ.50 కోట్లకుపైగా నిధులు రానుండటంతో పల్లె పాలన మళ్లీ గాడిలో పడనుంది.