News December 18, 2025
MNCL: సింగరేణి ఆవిర్భావ వేడుకలకు నిధులు

ఈ నెల 23న జరగనున్న సింగరేణి ఆవిర్భావ దినోత్సవం వేడుకల నిర్వహణకు డివిజన్ల వారీగా యాజమాన్యం నిధులు కేటాయించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో మందమర్రి డివిజన్కు రూ.60 వేలు, శ్రీరాంపూర్ డివిజన్కు రూ.60 వేలు, బెల్లంపల్లి డివిజన్కు రూ.50 వేలు, జైపూర్ ఎస్టీపీపీకి రూ.25 వేలు చొప్పున నిధులు కేటాయించారు.
Similar News
News December 21, 2025
KNR: ఆదిలోనే అడ్డంకి.. నిరాశ కలిగిస్తున్న ఫెర్టిలైజర్ యాప్

రైతులకు ఎరువుల లభ్యత, నిల్వలు, ధరల వివరాలను వేగంగా అందించాలనే ఉద్దేశంతో ప్రవేశపెట్టిన ‘Fertilizer’ మొబైల్ అప్లికేషన్ ప్రారంభంలోనే మొరాయించింది. యాప్ ఓపెన్ చేయగానే “ఈ యాప్ తాత్కాలికంగా నిలిపివేయబడింది” అనే సందేశం కనిపిస్తుండటంతో రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వ పథకాలు కాగితాల మీద పరిమితం కాకుండా, క్షేత్రస్థాయిలో రైతులకు ఉపయోగపడేలా ఉండాలని ఉమ్మడి KNR రైతులు కోరుకుంటున్నారు.
News December 21, 2025
కొండగట్టు: ‘పవనసుతుడిపై పవన్ ప్రేమ’

‘తన తల్లి జన్మనిస్తే కొండగట్టు అంజన్న పునర్జన్మనిచ్చారు’ అంటూ AP డిప్యూటీ CM పవన్ కళ్యాణ్ కొండగట్టు అంజన్నపై ఎనలేని ప్రేమచూపిస్తారు. ఏపీ ఎన్నికల్లో తన ‘వారాహి’ వాహనానికి ప్రత్యేకపూజలు నిర్వహించి ఇక్కడి నుంచే ప్రచారాన్ని ప్రారంభించారు. అంజన్నను పలుమార్లు దర్శించుకున్న ఆయన.. భక్తులు పడుతున్న కష్టాలను స్వయంగా తెలుసుకొని వారి సౌకర్యార్థం సత్ర నిర్మాణానికి సహకరించి అంజన్నపై తన ప్రేమను చాటుకున్నారు.
News December 21, 2025
హనుమంతుడి కన్నా గొప్ప దౌత్యవేత్త ఎవరు?: జైశంకర్

శ్రీకృష్ణుడు, హనుమంతుడు గొప్ప దౌత్యవేత్తలని విదేశాంగ మంత్రి జైశంకర్ అన్నారు. ‘సీత సమాచారం కోసం హనుమ శ్రీలంకకు వెళ్లాడు. సమాచారం తెలుసుకుని, సీతమ్మను కలిసి మనోధైర్యం నింపాడు. రావణుడిని మానసికంగా ఓడించగలిగాడు. ఇంతకన్నా గొప్ప దౌత్యవేత్త ఎవరు? ఒక పని చెబితే 10 పనులు పూర్తిచేశాడు. అలాంటి వ్యక్తి గురించి ప్రపంచానికి తెలియజేయకపోతే మన సంస్కృతికి అన్యాయం చేసినట్లే’ అని పుణే బుక్ ఫెస్టివల్లో అన్నారు.


