News February 4, 2025
MNCL: సింగరేణి ఉద్యోగులకు శుభవార్త

2024- 25 ఆర్థిక సంవత్సరంలో నిర్దేశిత బొగ్గు ఉత్పత్తి లక్ష్యం సాధించేందుకు ఉద్యోగులకు స్పెషల్ ఇన్సెంటివ్ను ప్రవేశపెడుతూ సింగరేణి యాజమాన్యం ఉత్తర్వులు జారీ చేసింది. 72 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి లక్ష్యానికి జనవరి వరకు 53.73 మిలియన్ టన్నుల ఉత్పత్తి జరిగింది. ఫిబ్రవరి, మార్చి నెలల్లో మిగతా 18.27 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి సాధనకు ఉద్యోగులకు స్పెషల్ ఇన్సెంటివ్ అందించనున్నారు.
Similar News
News February 24, 2026
KKD: 19,593 ఇళ్లపై సోలార్ ప్యానెల్స్!

KKD జిల్లాలో PM సూర్య ఘర్ పథకం కింద SC, ST వర్గాల గృహాలపై సోలార్ ప్యానెల్ ఇన్స్టాలేషన్ పనులు వేగవంతం చేయాలని కలెక్టర్ షాన్మోహన్ ఆదేశించారు. మంగళవారం KKD కలెక్టరేట్ నుంచి APEPDCL అధికారులు, వెండార్లతో దీనిపై సమీక్షించారు. జిల్లాలో 19,593 మంది SC, STల గృహాలపై సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. లబ్ధిదారులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా నాణ్యమైన ప్యానెల్స్ అమర్చాలని అధికారులకు సూచించారు.
News February 24, 2026
బ్రహ్మోత్సవాలను పటిష్ఠంగా నిర్వహించాలి: కలెక్టర్

అహోబిలం శ్రీ లక్ష్మీనరసింహ స్వామి బ్రహ్మోత్సవాలను ఎటువంటి లోపాలు లేకుండా పటిష్ఠంగా నిర్వహించేందుకు సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ రాజకుమారి ఆదేశించారు. కలెక్టరేట్లో బ్రహ్మోత్సవాలపై నిర్వహించిన సమీక్షా సమావేశంలో సంబంధిత అధికారులకు పలు సూచనలు చేశారు. బ్రహ్మోత్సవాలు మార్చి 4వ తేదీ వరకు జరుగుతాయన్నారు. భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.
News February 24, 2026
వీఆర్ఎస్-3లో ఉక్కు యాజమాన్యం వెనుకడుగు..?

విశాఖ స్టీల్ ప్లాంట్లో వీఆర్ఎస్-3 విషయంలో యాజమాన్యం వెనక్కి తగ్గినట్టు సంకేతాలు కనిపిస్తున్నాయి. మూడో విడతకు 700 మంది దరఖాస్తు చేసుకోగా కేవలం 67 మందికే ఆమోదం ఇవ్వడం చర్చనీయాంశమైంది. వీఆర్ఎస్-1లో 1,126 మందికి, వీఆర్ఎస్-2లో 464 మందికి ఆమోదం లభించడంతో ఇప్పటికే సిబ్బంది కొరత తీవ్రంగా మారింది. ఉత్పత్తిపై ప్రభావం పడుతోందనే వీఆర్ఎస్కు పరిమిత సంఖ్యలో యాజమాన్యం ఆమోదం తెలిపినట్లు తెలుస్తోంది.


