News April 12, 2024

MNCL: సెల్‌ఫోన్ రిపేర్ చేయించలేదని యువతి సూసైడ్

image

మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం వేలాల గ్రామానికి చెందిన సాయిష్మ అనే యువతి సెల్‌ఫోన్ రిపేర్ చేయించకపోవడంతో ఆత్మహత్యకు పాల్పడింది. 15 రోజుల కిందట సెల్‌ఫోన్ డిస్ ప్లే పగిలిపోవడంతో బాగు చేయించాలని తల్లిదండ్రులను కోరింది. ఈ విషయంలో తరచూ ఇంట్లో గొడవలు జరుగుతుండగా గురువారం ఆమె తల్లిదండ్రులు మందలించారు. దీంతో ఇంట్లో ఎవరూ లేని సమయంలో సాయిష్మ ఉరివేసుకొని బలవన్మరణానికి పాల్పడినట్లు ఏఎస్సై నాగరాజు తెలిపారు.

Similar News

News September 30, 2024

విద్యార్థులు కష్టపడి పోటీపరీక్షల్లో రాణించాలి: గోడం నగేశ్

image

హైదరాబాద్‌లోని కొమరం భీం స్టడీ సర్కిల్‌లో ఆదివారం నిర్వహించిన సమావేశంలో ముఖ్య అతిథిగా ఆదిలాబాద్ ఎంపీ నగేశ్ హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ.. పోటీ పరీక్షలకు సన్నద్ధం అయ్యే విద్యార్థులు ప్రణాళికబద్ధంగా చదవాలన్నారు. కష్టపడి చదివి ఉద్యోగాలు సాధించాలని సూచించారు. కార్యక్రమంలో వేణుగోపాల్ రెడ్డి, డా.సిడాం మధుకర్, మేస్రం నాగోరావు, తదితరులు పాల్గొన్నారు.

News September 29, 2024

ఆదిలాబాద్: DEECET విద్యార్థులకు GOOD NEWS

image

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో TG DEECET-2024లో ర్యాంక్ సాధించి ఆగస్టు నెలలో సర్టిఫికేట్ వెరిఫికేషన్‌కు హాజరుకాని అభ్యర్థులకు మరొకసారి అవకాశం కల్పించినట్లు కళాశాల ప్రిన్సిపల్ రవీందర్ రెడ్డి పేర్కొన్నారు. కళాశాలలో అక్టోబర్ 1న ఉ.10 నుంచి సా.5 గంటల వరకు అన్ని ఒరిజినల్ సర్టిఫికెట్స్‌తో హాజరు కావాలని సూచించారు. అభ్యర్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలన్నారు.

News September 29, 2024

ASF: రేపు జోనల్ స్థాయి హ్యాండ్ బాల్ పోటీలు

image

ఆసిఫాబాద్‌లోని గిరిజన ఆదర్శ బాలికల క్రీడా పాఠశాలలో సోమవారం SGFజోనల్ స్థాయి అండర్-17 బాలబాలికల హ్యాండ్ బాల్ పోటీలు నిర్వహించనున్నట్లు DEOయాదయ్య, SGF జిల్లా సెక్రటరీ సాంబశివరావు తెలిపారు. ఈ పోటీల్లో పాల్గొనే ఉమ్మడి జిల్లా క్రీడాకారులు ఎంట్రీ ఫామ్‌లతో ఉదయం 9గంటలకు హాజరుకావాలన్నారు. వివరాలకు TW క్రీడల అధికారి మీనారెడ్డి, కోచ్ అరవింద్‌ను సంప్రదించాలని సూచించారు.