News March 8, 2025

MNCL: స్ట్రక్చర్ సమావేశంలో పలు అంశాలపై ఒప్పందం

image

సింగరేణి గుర్తింపు సంఘం ఏఐటీయూసీతో శుక్రవారం జరిగిన సీఅండ్ఎండీ స్థాయి స్ట్రక్చర్ సమావేశంలో అంశాలపై చర్చించి ఒక ఒప్పందానికి వచ్చారు. పెర్క్స్ పై ఐటీ చెల్లించడంపై కమిటీ ఏర్పాటు, సొంత ఇంటి పథకం అమలు, అన్ని రకాల మజ్దూర్ల డిజిగ్నేషన్ మార్చుటకు, డిస్మిస్ కార్మికులకు ఐదేళ్ళలో ఏదైనా ఒక ఏడాదిలో 100 మాస్టర్లు ఉంటే ఒక అవకాశం కల్పించాలని నిర్ణయించారు.

Similar News

News February 25, 2026

తెలుగు భాషను మరువొద్దు: మంత్రి లోకేశ్

image

సత్తెనపల్లి సుగాలి జెడ్పీ హైస్కూల్ విద్యార్థులతో వెలగపూడి అసెంబ్లీ లాబీలో మంత్రి లోకేశ్ ముచ్చటించారు. పిల్లలే రాష్ట్ర భవిత అని, చరిత సృష్టించేది మీరేనని ఆయన అన్నారు. కెరీర్ కోసం ఇంగ్లీష్ నేర్చుకుంటూనే మాతృభాష తెలుగును మరవొద్దని సూచించారు. విదేశాల్లో చదవడం వల్ల మొదట్లో తాను ఇబ్బంది పడ్డానని చెప్పారు. ఈ సందర్భంగా స్కూల్లో భోజనం, రాగిజావ, బోధన తదితర సౌకర్యాలపై విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు.

News February 25, 2026

విశాఖ జిల్లా కోర్టుకు బాంబు బెదిరింపులు

image

నగరంలో గల జిల్లా కోర్టులో ఆర్డీఎక్స్ బాంబు పెట్టినట్లు అజ్ఞాత వ్యక్తి ఈ మెయిల్ పంపాడు. సిబ్బంది వెంటనే స్పందించి నగర పోలీస్ కమిషనర్‌కు సమాచారం అందించారు. వెంటనే డాగ్ స్క్వాడ్ సిబ్బంది కోర్టుకు చేరుకున్నారు. సుమారు రెండు గంటల పాటు కోర్టు ఆవరణం మొత్తం జల్లెడ పట్టారు. ఎక్కడా ఎటువంటి బాంబు లేదని వారు నిర్ధారించారు.

News February 25, 2026

SKLM: ‘డయేరియా బాధితులకు మెరుగైన వైద్యం అందించండి’

image

డయేరియా బాధితులకు మరింత మెరుగైన వైద్యం అందించాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఆసుపత్రి వైద్యులను ఆదేశించారు. జేమ్స్ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న డయేరియా బాధితులను బుధవారం ఆయన పరామర్శించారు. వారికి అందిస్తున్న వైద్యం వివరాలను డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. మెరుగైన వైద్యం అందించాలని అన్నారు.