News March 8, 2025

MNCL: స్ట్రక్చర్ సమావేశంలో పలు అంశాలపై ఒప్పందం

image

సింగరేణి గుర్తింపు సంఘం ఏఐటీయూసీతో శుక్రవారం జరిగిన సీఅండ్ఎండీ స్థాయి స్ట్రక్చర్ సమావేశంలో అంశాలపై చర్చించి ఒక ఒప్పందానికి వచ్చారు. పెర్క్స్ పై ఐటీ చెల్లించడంపై కమిటీ ఏర్పాటు, సొంత ఇంటి పథకం అమలు, అన్ని రకాల మజ్దూర్ల డిజిగ్నేషన్ మార్చుటకు, డిస్మిస్ కార్మికులకు ఐదేళ్ళలో ఏదైనా ఒక ఏడాదిలో 100 మాస్టర్లు ఉంటే ఒక అవకాశం కల్పించాలని నిర్ణయించారు.

Similar News

News September 16, 2025

సిరిసిల్ల: ‘మోక్షగుండం విశ్వేశ్వరయ్య సేవలు మరువలేనివి’

image

సిరిసిల్లలోని కలెక్టరేట్లో మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతి సందర్భంగా ఇంజనీర్స్ డే వేడుకలను అధికారులు సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా టీజీవో జిల్లా అధ్యక్షుడు సమరసేన్ మాట్లాడుతూ.. మోక్షగుండం విశ్వేశ్వరయ్య దేశ నిర్మాణం కోసం చేసిన సేవలు ఎన్నటికీ మరువలేని కొనియాడారు. ఆయన నిర్మించిన సాగునీటి, తాగునీటి కట్టడాలు ఆయనకున్న పట్టుదల నిజాయితీని ప్రపంచం కీర్తించిందని పేర్కొన్నారు.

News September 16, 2025

ప్రజా సమస్యల పరిష్కార వేదికకు 9 అర్జీలు: ఎస్పీ

image

ప్రజా ఫిర్యాదుల పరిష్కారానికి మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని, అర్జీలు పునరావృతం కాకుండా చట్ట పరిధిలో శాశ్వత పరిష్కారం చూపాలని ఎస్పీ శ్రీ అద్నాన్ నయీం అస్మీ అన్నారు. పాలకోడేరు మండలం గరగపర్రులోని జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా వేదికకు 9 అర్జీలు వచ్చాయన్నారు. వాటిని నిర్ణీత గడువులోగా పరిష్కరించాలన్నారు.

News September 16, 2025

ప.గో: 13 మంది ఉద్యోగులకు పదోన్నతి

image

ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పరిషత్‌లో ఏఓలు, డిప్యూటీ ఎంపీడీవోలుగా పనిచేస్తున్న 13 మంది ఉద్యోగులకు పదోన్నతి కల్పిస్తూ జడ్పీ ఛైర్‌పర్సన్ ఘంటా పద్మశ్రీ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. తమ శ్రమను గుర్తించి ఇచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటామని ఆమె తెలిపారు. ఉద్యోగుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నానని ఈ సందర్భంగా పేర్కొన్నారు.