News January 31, 2025
MNCL: 10వ తరగతి పరీక్షలలో జిల్లా మెరవాలి: కలెక్టర్

10వ తరగతి వార్షిక పరీక్షలలో 100 శాతం ఉత్తీర్ణత సాధించి జిల్లాను ఉన్నతస్థానంలో నిలపాలని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. గురువారం మంచిర్యాలలో నిర్వహించిన ప్రేరణ అవగాహన తరగతుల్లో ఆయన మాట్లాడారు. పరీక్షలకు 50రోజుల సమయమే ఉన్నందున ఏకాగ్రతతో చదవాలని సూచించారు. ఉన్నత లక్ష్యాలను ఎంచుకొని సాధించేలా పట్టుదలతో కృషి చేయాలన్నారు. ఉత్తమ ఫలితాలు సాధించి తల్లిదండ్రులకు, పాఠశాలకు మంచి పేరు తీసుకురావాలన్నారు.
Similar News
News November 22, 2025
విద్యార్థినుల కోసం కొత్త పథకం: మంత్రి లోకేశ్

AP: వచ్చే ఏడాది నుంచి ఉన్నత విద్యను అభ్యసించే విద్యార్థినులకు ‘కలలకు రెక్కలు’ పథకాన్ని అమలు చేస్తామని మంత్రి లోకేశ్ తెలిపారు. దీనిపై విధివిధానాలు రూపొందించాలని అధికారులను ఆదేశించినట్లు చెప్పారు. ‘దేశవిదేశాల్లో ఉన్నత విద్య చదవాలనే విద్యార్థినులకు ఆర్థిక సాయం అందిస్తాం. ప్రస్తుతం విదేశాల్లో APకి చెందిన 27,112 మంది, స్వదేశంలో 88,196 మంది విద్యార్థినులు ఉన్నత చదువులు చదువుతున్నారు’ అని ట్వీట్ చేశారు.
News November 22, 2025
వరంగల్ సెంట్రల్ జైలు నిర్మాణం ఎప్పుడు..?

నిజాం కాలం నాటి WGL సెంట్రల్ జైలు 2021లో కూల్చగా, మామునూరులో కొత్త జైలు నిర్మిస్తామని ప్రకటించినా నాలుగున్నరేళ్లుగా పనులు మొదలుకాలేదు. వెయ్యి మంది ఖైదీలను ఇతర జైళ్లకు మార్చడంతో వారి కుటుంబాలు కలుసుకోవడానికే ఇబ్బందులు పడుతున్నారు.101 ఎకరాలు కేటాయించినా బడ్జెట్ లేక పనులు నిలిచాయి. ప్రస్తుతం మామునూరులో 20 మంది ఖైదీలకు 40 మంది సిబ్బంది పని చేస్తుండగా, కొత్త జైలు నిర్మాణంపై ప్రభుత్వం స్పందించడం లేదు.
News November 22, 2025
CSIR-NML 67 పోస్టులకు నోటిఫికేషన్

<


