News February 26, 2026
MNCL: 10వ తరగతి వార్షిక పరీక్షలకు 48 పరీక్షా కేంద్రాలు

10వ తరగతి వార్షిక పరీక్షల కార్యాచరణ ఖరారైందని మంచిర్యాల డీఈఓ యాదయ్య తెలిపారు. మార్చి 14 నుంచి ఏప్రిల్ 16వ తేదీ వరకు పరీక్షలు నిర్వహించడం జరుగుతుందన్నారు. ఇందు కోసం జిల్లాలో 48 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. పరీక్షలను సమర్థవంతంగా నిర్వహించేందుకు సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో చర్యలు తీసుకుంటున్నామన్నారు.
Similar News
News April 14, 2026
ఖమ్మం జిల్లాలో పెరిగిన కూలీ రేట్లు

ఖమ్మం జిల్లాలో సుతారీ మేస్త్రీలు, సహాయ కార్మికుల కూలీ రేట్లు పెంచుతూ కార్మిక శాఖ నిర్ణయం తీసుకుంది. సోమవారం బిల్డర్స్ అసోసియేషన్, కార్మిక సంఘాలతో నిర్వహించిన సమావేశంలో మేస్త్రీ కూలీ రూ.950 నుంచి రూ.1,050కు, సహాయకుల కూలీ రూ.670 నుంచి రూ.735కు పెంచినట్లు డిప్యూటీ కమిషనర్ విజయభాస్కర్ రెడ్డి తెలిపారు. పెరిగిన రేట్లు తక్షణమే అమల్లోకి వస్తాయని ఆయన స్పష్టం చేశారు.
News April 14, 2026
కడప: స్పోర్ట్స్ కోటా టీచర్లకు తిరుపతిలో రేపు సమావేశం

మెగా డీఎస్సీ 2025లో స్పోర్ట్స్ కోట ద్వారా ఎంపికైన ఉపాధ్యాయులకు ఈ నెల 15న తిరుపతిలో సమావేశం నిర్వహించనున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి శంషుద్దీన్ మంగళవారం తెలిపారు. కొత్తగా నియామకమైన ఉపాధ్యాయులు ఉదయం 9 గంటలకు డీఎస్డీవో/డీఎస్ఏ కార్యాలయం, తిరుపతిలో తప్పనిసరిగా హాజరుకావాలని సూచించారు. విద్యాశాఖ మంత్రి ప్రత్యేక సందేశం ఇవ్వనున్నట్లు తెలిపారు.
News April 14, 2026
శుభవార్త.. పోలీసులకు ప్రత్యేక సెలవులు

AP: నిత్యం విధుల్లో ఉండే పోలీసులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. బర్త్ డే, మ్యారేజ్ డే సందర్భంగా వారు కుటుంబంతో గడిపేందుకు వీలుగా స్పెషల్ లీవ్స్ కల్పిస్తూ డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా ఉత్తర్వులిచ్చారు. అన్ని ర్యాంకుల సిబ్బందికి ఈ సెలవులు మంజూరు చేయాలని జిల్లాల ఎస్పీలు, అన్ని పోలీస్ విభాగాల అధిపతులను ఆదేశించారు. దీంతో వేలాది పోలీసులకు ఊరట కలగనుంది.


