News December 22, 2024

MNCL: 11 నుంచి 27 వరకు టెక్నికల్ సర్టిఫికెట్ కోర్సు పరీక్షలు

image

మంచిర్యాల జిల్లాలో టెక్నికల్ సర్టిఫికెట్ కోర్సు పరీక్షలు జనవరి 11 నుంచి 27 వరకు నిర్వహించనున్నట్లు డీఈఓ యాదయ్య తెలిపారు. 11 నుంచి 17 వరకు డ్రాయింగ్ లోయర్ గ్రేడ్, హైయ్యర్ గ్రేడ్ పరీక్ష, 11వ తేదీన టైలరింగ్ అండ్ ఎంబ్రాయిడరీ లోయర్ గ్రేడ్, 12, 16వ తేదీన హైయర్ గ్రేడ్ పరీక్షలు జరుగుతాయని పేర్కొన్నారు. ఈ పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు హల్ టికెట్లు డౌన్ లోడ్ చేసుకోవాలని సూచించారు.

Similar News

News December 22, 2025

ఎస్పీ గ్రీవెన్స్‌కు 32 ఫిర్యాదు: ADB ఎస్పీ

image

పోలీసు కార్యాలయంలో గ్రీవెన్స్ డే సందర్భంగా జిల్లా నలుమూలల నుంచి 32 ఫిర్యాదులు వచ్చినట్లు ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. సంబంధిత పోలీసు అధికారులకు ఫోన్ ద్వారా ఆదేశాలిచ్చి వాటిని వెంటనే పరిష్కరించాలని సూచించారు. అసాంఘిక కార్యకలాపాల ఫిర్యాదు కోసం ప్రజలు 8712659973 నంబర్‌కు వాట్సప్ ద్వారా సమాచారం అందజేయాలని వివరించారు.

News December 22, 2025

మంత్రి జూపల్లి కృష్ణారావును కలిసిన జోగు రామన్న

image

ఆదిలాబాద్ ఇన్‌ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావును సోమవారం హైదరాబాద్‌లోని సెక్రటేరియట్‌లో మాజీ మంత్రి జోగురామన్న కలిశారు. గత ప్రభుత్వ హయాంలో మొదలుపెట్టి పెండింగ్‌లో ఉన్న అభివృద్ధి పనులను పూర్తిచేయాలని కోరారు. అదేవిధంగా చనాక కొరాట ప్రాజెక్టుకు సంబంధించి పనులను త్వరగా పూర్తయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని విన్నవించినట్లు జోగురామన్న తెలిపారు.

News December 21, 2025

ఆదిలాబాద్: సోమవారం ప్రజావాణి యథాతథం

image

ఈ సోమవారం (22 వ తేదీ) నుంచి ప్రజావాణి కార్యక్రమం యథావిధిగా కొనసాగుతుందని జిల్లా కలెక్టర్ రాజర్షి షా తెలిపారు. గ్రామపంచాయతీ ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలులో ఉన్నందున ఇన్ని రోజులు వాయిదా పడిన ప్రజావాణి కార్యక్రమం సోమవారం నుంచి తిరిగి ప్రారంభమవుతుందన్నారు. ప్రజలు ఎవరైనా తమ సమస్యల గురించి దరఖాస్తులు ఇవ్వదలుచుకుంటే ఈ విషయాన్ని గమనించాలని సూచించారు.