News February 18, 2025

MNCL: 30వ రోజుకు చేరుకున్న రిలే నిరాహారదీక్షలు

image

మంచిర్యాలలోని శాలివాహన పవర్ ప్లాంట్ ఎదుట కార్మికులు చేస్తున్న రిలే నిరాహారదీక్షలు నేటితో 30వ రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా కార్మిక సంఘం అధ్యక్షుడు కుంటాల శంకర్ మాట్లాడుతూ.. ప్లాంట్ మూసివేసి 26 నెలలు గడుస్తున్న కార్మికులకు రావలసిన బెనిఫిట్స్ చెల్లించకుండా కంపెనీ యాజమాని, ప్రస్తుత బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి మల్కా కొమురయ్య నిర్లక్ష్యం చేస్తున్నారన్నారు.

Similar News

News December 16, 2025

గుంటూరు యార్డులో ‘ఘాటు’.. ఎల్లో మిర్చి @ రూ.280

image

గుంటూరు మిర్చి యార్డుకు మంగళవారం 60 వేల బస్తాల ఏసీ సరుకు పోటెత్తింది. మార్కెట్‌లో ఎల్లో రకం మిర్చి రికార్డు స్థాయిలో కిలో రూ.200 నుంచి రూ.280 పలికింది. ముఖ్యంగా 2043 ఏసీ రకం గరిష్టంగా రూ.200, నాటు సూపర్-10 రూ.180, నంబర్-5 రూ.175 వరకు అమ్ముడయ్యాయి. ప్రధాన రకమైన తేజా ఏసీ రూ.120-149, 355 రకం రూ.170, బుల్లెట్ రూ.165 పలికాయి. మీడియం సీడు రకాలు రూ.90-110, తాలు రకాలు రూ.60-90 మధ్య ధర పలికాయి.

News December 16, 2025

మండపేట: వేగుళ్లకి తోట త్రిమూర్తులు సవాల్

image

మండపేట ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు కేవలం అవకాశవాది మాత్రమేనని రాష్ట్ర సబ్ ఆర్డినేటర్ కమిటీ ఛైర్మన్, వైసీపీ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్, ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు విమర్శించారు. మండపేట వైసీపీ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎమ్మెల్యేది మేడిపండు నైజమని వ్యాఖ్యానించారు. ఆయనతో బహిరంగ చర్చకు తాను ఎప్పుడైనా సిద్ధమేనని సవాల్ విసిరారు.

News December 16, 2025

జగిత్యాల: ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించాలి: కలెక్టర్

image

ఈనెల17న జరగనున్న పంచాయతీ ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించాలని కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు. 6 మండలాల్లో జరుగునున్న పోలింగ్ కేంద్రాల డిస్ట్రిబ్యూషన్ సెంటర్‌లను ఆయన పరిశీలించారు. పోలింగ్ కేంద్రాల ఏర్పాటు, సిబ్బంది బాధ్యతలు పంపిణీ,లాజిస్టిక్ ఎన్నికల మెటీరియల్‌ను పరిశీలించారు. ఎన్నికల నిర్వహణకు 1306 మంది పిఓలు, 1706 ఏపిఓ సిబ్బందిని కేటాయించినట్లు కలెక్టర్ తెలిపారు.