News February 19, 2025

MNCL: 5మండలాల ప్రజలకు శుభవార్త

image

అభయారణ్యంలోని అటవీ చెక్ పోస్టుల ద్వారా 5 మండలాల ప్రజల వాహనాలకు అనుమతి ఇవ్వడం జరిగిందని జన్నారం మండలంలోని ఇందన్పల్లి ఎఫ్ఆర్ఓ కారం శ్రీనివాస్ తెలిపారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ జన్నారం, కడెం, దస్తురాబాద్, దండేపల్లి, ఉట్నూర్ మండలాల వాహనాలకు చెక్ పోస్టుల ద్వారా అనుమతి ఉందన్నారు. ఆ వాహనాల యజమానులు సెస్ చెల్లించాల్సిన అవసరం లేదని, ఈ విషయాన్ని వాహనదారులు గమనించి ధ్రువీకరణ పత్రాలు చూపించి సహకరించాలన్నారు.

Similar News

News September 16, 2025

సిరిసిల్ల: ‘ద్వితీయ మహాసభలు విజయవంతం చేయాలి’

image

ఈనెల 23, 24న జరిగే కెవిపిఎస్ జిల్లా ద్వితీయ మహాసభలను విజయవంతం చేయాలని కెవిపిఎస్ జిల్లా కార్యదర్శి ఎర్రవెల్లి నాగరాజు అన్నారు. సిరిసిల్లలో మహాసభల కరపత్రాలను మంగళవారం ఆయన ఆవిష్కరించారు. అనంతరం నాగరాజు మాట్లాడుతూ.. 2003 ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ చట్టం, 2013 దళితుల శవాలను పూడ్చడానికి ప్రభుత్వం రెండెకరాల స్మశాన స్థలం ఇవ్వాలన్న జీవో నంబర్ 1234లను కెవిపిఎస్ పోరాడి సాధించిందన్నారు.

News September 16, 2025

ధాన్యానికి గిట్టుబాటు ధర వచ్చేనా…?

image

నెల్లూరు జిల్లాలో ఎడగారుగా 5 లక్షల ఎకరాల్లో వరిని సాగు చేశారు. కోతలు కోసే సమయానికి వర్షాలు పడడంతో పలుచోట్ల పంట పొలాలు ధ్వంసం అయ్యాయి. ఇప్పటికే ధాన్యానికి గిట్టుబాటు ధర లేక రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయకపోవడంతో దళారులు తక్కువ ధరకే అడుగుతున్నారని రైతులు వాపోతున్నారు. ప్రభుత్వం స్పందించి గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు.

News September 16, 2025

సిరిసిల్ల: బిల్డింగ్ కన్స్ట్రక్షన్ వర్కర్ యూనియన్ కార్యవర్గం ఎన్నిక

image

తెలంగాణ బిల్డింగ్, కన్స్ట్రక్షన్ వర్కర్ యూనియన్ సిఐటియు సిరిసిల్ల జిల్లా నూతన కమిటీని ఎన్నుకున్నట్టు కార్యవర్గ సభ్యులు తెలిపారు. అధ్యక్షుడిగా గీస బిక్షపతి, ప్రధాన కార్యదర్శిగా ఎగమంటి ఎల్లారెడ్డి, ఉపాధ్యక్షులుగా శ్రీధర్, శ్రీనివాస్, రమేష్, సహాయ కార్యదర్శులుగా నరేందర్, రాజెల్లయ్య, భూమయ్య, వెంకటి, కోశాధికారిగా ప్రభాకర్ ను ఎన్నుకున్నామన్నారు. నూతన కమిటీకి పలువురు శుభాకాంక్షలు తెలిపారు.