News September 4, 2025

MNCL: 5, 6 తేదీల్లో కార్మికుల సమ్మె

image

ఈ నెల 5, 6 తేదీల్లో జరిగే పోస్ట్ మెట్రిక్ హాస్టల్ కార్మికుల సమ్మెను విజయవంతం చేయాలని ఐఎఫ్టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి బ్రహ్మానందం పిలుపునిచ్చారు. గురువారం మంచిర్యాల జిల్లా ఎస్సీ అభివృద్ది శాఖ అధికారికి ఆయన సమ్మె నోటీస్ అందజేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఎనిమిది నెలలుగా వేతనాలు చెల్లించకపోవడంతో పోస్ట్ మెట్రిక్ హాస్టల్ వర్కర్స్ ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులకు గురవుతున్నారని తెలిపారు.

Similar News

News September 7, 2025

నేడు ఈ జిల్లాల్లో వర్షాలు: APSDMA

image

AP: వాయవ్య బంగాళాఖాతం, ఆనుకుని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో దక్షిణ ఒడిశా- ఉత్తరాంధ్ర తీరాల మీదుగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. దీని ప్రభావంతో ఇవాళ శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, మిగతా జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.

News September 7, 2025

ఇండియా స్కిల్స్‌ కాంపిటీషన్‌–2025 పోస్టర్లను ఆవిష్కరించిన కలెక్టర్ ఇండియా

image

ఇండియా స్కిల్స్‌ కాంపిటీషన్‌–2025 పోస్టర్లను కలెక్టర్ ఆనంద్ కలెక్టరేట్లోని తన ఛాంబర్లో ఆవిష్కరించారు. పోటీల్లో పాల్గొనడానికి 16-25 ఏళ్ల యువత అర్హులన్నారు. ఈనెల 30లోపు ఈకేవైసీ ధ్రువీకరణ సహా రిజిస్ట్రేషన్ చేయించుకోవాల్సి ఉందన్నారు. స్కిల్ ఇండియా డిజిటల్ హబ్లో ఎస్ఐడీహెచ్ పోర్టల్ లో ప్రత్యేక ఖాతాను ఏర్పాటుచేసుకుని ఆన్లైన్ దరఖాస్తు చేసుకోవాలన్నారు.

News September 7, 2025

ఐదేళ్లలో 50 వేల మందికి విదేశాల్లో ఉద్యోగాలు: మంత్రి లోకేశ్

image

AP: సీడాప్ ద్వారా వచ్చే ఐదేళ్లలో 50 వేల మందికి విదేశాల్లో ఉద్యోగావకాశాలు కల్పించనున్నట్లు మంత్రి లోకేశ్ తెలిపారు. ఈ నెలలోనే నైపుణ్యం పోర్టల్‌ను ప్రారంభిస్తామన్నారు. అంతర్జాతీయ ప్లేస్ మెంట్ పథకం కింద జర్మనీ ఆసుపత్రుల్లో ఉద్యోగాలు పొందిన అభ్యర్థులను అభినందించారు. తొలి బ్యాచ్‌లో సీడాప్ ద్వారా మొత్తం 171 మందికి శిక్షణనివ్వగా, ఇప్పటికే వివిధ విభాగాల్లో 40 మంది ఉద్యోగాలకు ఎంపికయ్యారని తెలిపారు.