News April 7, 2025
MNCL: 7న BRS ముఖ్య కార్యకర్తల సమావేశం

బెల్లంపల్లి పట్టణం AMC గ్రౌండ్ క్వార్టర్ నంబరు3లో ఈనెల 7న జరగనున్న నియోజకవర్గం BRS ముఖ్య కార్యకర్తల సమావేశాన్ని నాయకులు, కార్యకర్తలు భారీగా హాజరై విజయవంతం చేయాలని మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య పిలుపునిచ్చారు. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా మాజీ ఎమ్మెల్యే, జిల్లా అధ్యక్షుడు బాల్క సుమన్ హాజరుకానున్నట్లు పేర్కొన్నారు.
Similar News
News October 22, 2025
కుంకుమపువ్వుతో మహిళలకు ఎన్నో లాభాలు

కుంకుమపువ్వుతో మహిళలకు ఎన్నో ప్రయోజనాలున్నాయంటున్నారు నిపుణులు. హార్మోన్ల సమతుల్యతను కాపాడటంతో పాటు బీపీ, కొలెస్ట్రాల్ను అదుపులో ఉంచి గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. గుండె ఆరోగ్యాన్ని కాపాడే క్రోసెటిన్, క్రోసిన్ కుంకుమపువ్వులో ఉంటాయంటున్నారు. రోగనిరోధకశక్తిని పెంచడంలో కూడా ఇది తోడ్పడుతుంది. పాలలో కలుపుకొని తాగటం లేదా కుంకుమ పువ్వు టీ చేసుకొని తాగడం మంచిదని సూచిస్తున్నారు.
News October 22, 2025
మహిళలకు నెలకు రూ.30 వేలు.. RJD కొత్త పథకం

బిహార్ అసెంబ్లీ ఎన్నికల వేళ పార్టీలు హామీలతో ప్రజలను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డాయి. ఇటీవల JDU-BJP ప్రభుత్వం స్వయం ఉపాధి కోసం మహిళల అకౌంట్లలో రూ.10 వేలు జమ చేయడం తెలిసిందే. తాజాగా RJD చీఫ్ తేజస్వీ యాదవ్ మహిళా సంఘాల సభ్యులను శాశ్వత ప్రభుత్వ ఉద్యోగులను చేస్తామని హామీ ఇచ్చారు. అధికారంలోకి వస్తే ‘జీవికా CM’ స్కీం పేరిట ప్రతి నెల రూ.30,000 జీతం ఇస్తామన్నారు. లోన్లపై వడ్డీ మాఫీ చేస్తామని ప్రకటించారు.
News October 22, 2025
పల్నాడు: రోడ్డు ప్రమాదాల నివారణకు ‘ఫేస్ వాష్ అండ్ గో’

పల్నాడు జిల్లాలో జాతీయ రహదారులపై రోడ్డు ప్రమాదాలను నివారించడానికి పోలీసులు ‘ఫేస్ వాష్ అండ్ గో’ కార్యక్రమాన్ని నిర్వహించారు. అర్ధరాత్రి తర్వాత లారీలు, బస్సులు, వ్యాన్లు, కార్ల డ్రైవర్లకు నీళ్లతో ముఖం కడిగించి పంపించారు. డ్రైవింగ్లో కుటుంబ సభ్యులను గుర్తు చేసుకుంటూ జాగ్రత్తగా నడపాలని డ్రైవర్లకు పోలీసులు సూచించారు. దాచేపల్లి, మాచర్ల, నరసరావుపేట సహా పలు స్టేషన్ల పరిధిలో ఈ కార్యక్రమం జరిగింది.