News April 7, 2025

MNCL: 7న BRS ముఖ్య కార్యకర్తల సమావేశం

image

బెల్లంపల్లి పట్టణం AMC గ్రౌండ్ క్వార్టర్ నంబరు3లో ఈనెల 7న జరగనున్న నియోజకవర్గం BRS ముఖ్య కార్యకర్తల సమావేశాన్ని నాయకులు, కార్యకర్తలు భారీగా హాజరై విజయవంతం చేయాలని మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య పిలుపునిచ్చారు. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా మాజీ ఎమ్మెల్యే, జిల్లా అధ్యక్షుడు బాల్క సుమన్ హాజరుకానున్నట్లు పేర్కొన్నారు.

Similar News

News December 14, 2025

సర్పంచ్ రిజల్ట్స్: ఉత్తర తెలంగాణలో బీజేపీ సత్తా

image

TG: ఉత్తర తెలంగాణలో బీజేపీ సత్తా చాటుతోంది. రెండో విడత పంచాయతీ ఎన్నికల్లో ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల్లో BRS కంటే ఎక్కువ సీట్లు కమలం పార్టీ మద్దతుదారులే సొంతం చేసుకున్నారు. నిర్మల్ జిల్లాలో కాంగ్రెస్ కంటే ఎక్కువ స్థానాలు గెలుచుకోవడం విశేషం. కాగా 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 4 ఎమ్మెల్యే సీట్లు గెలిచిన సంగతి తెలిసిందే.

News December 14, 2025

మహాత్మనగర్‌లో ఒక్క ఓటుతో సంపత్‌ విజయం

image

కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం మహాత్మనగర్ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థి పొన్నాల సంపత్ సంచలన విజయం నమోదు చేశారు. కేవలం ఒక్క ఓటు మెజారిటీతో సంపత్ సర్పంచ్‌గా గెలుపొందారు. ఈ స్వల్ప తేడాతో గెలవడంతో గ్రామంలో ఉత్కంఠ నెలకొంది. సంపత్‌కు గ్రామ ప్రజలు, అభిమానులు అభినందనలు తెలిపారు. తన గెలుపునకు సహకరించిన గ్రామ ప్రజలకు సంపత్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

News December 14, 2025

మల్యాల సర్పంచ్‌గా జయప్రసాద్

image

మల్యాల మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ స్థానాన్ని బీజేపీ బలపరిచిన బొట్ల జయప్రసాద్ కైవసం చేసుకున్నారు. పంచాయతీ పరిధిలో 9,978 ఓట్లకు గాను, 7141 ఓట్లు పోలయ్యాయి. కాగా, తన సమీప ప్రత్యర్థిపై 930 ఓట్ల భారీ మెజారిటీతో జయప్రసాద్ విజయం సాధించారు. కాగా, జగిత్యాల జిల్లాలో 16 అత్యధిక వార్డులతో మల్యాల మేజర్ గ్రామపంచాయతీ మొదటి స్థానంలో ఉంది.