News March 20, 2025
MNCL: ‘9,419 మంది పదో తరగతి పరీక్షలు రాస్తున్నారు’

జిల్లాలో ఈ నెల 21 నుంచి జరగనున్న పదవ తరగతి వార్షిక పరీక్షలకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు మంచిర్యాల డీఈఓ ఎస్.యాదయ్య తెలిపారు. 49 పరీక్ష కేంద్రాల్లో ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.30 వరకు పరీక్షలు జరుగుతాయన్నారు. మొత్తం 9,198 మంది రెగ్యులర్, 221 మంది ఫెయిలైన విద్యార్థులు పరీక్షలు రాయనున్నారని, పరీక్షా కేంద్రంలోకి సెల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ పరికరాలు తీసుకురావద్దని సూచించారు.
Similar News
News November 23, 2025
VZM: పార్ట్ టైం టీచర్ పోస్టులకు నోటిఫికేషన్

డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ గురుకుల పాఠశాలలు, కళాశాలల్లో పార్ట్టైమ్ ఉపాధ్యాయుల నియామకానికి దరఖాస్తులు కోరుతున్నట్లు కో ఆర్డినేటర్ మాణిక్యం తెలిపారు. JL ఫిజిక్స్ (పార్వతీపురం), TGT హిందీ (సాలూరు) పోస్టులకు పురుషులు, JL కామర్స్ (వియ్యంపేట), TGT ఇంగ్లిష్ (భామిని) పోస్టులకు మహిళా అభ్యర్థులు అర్హులు. ఈనెల 25న నెల్లిమర్ల డైట్ కళాశాల పక్కన ఉన్న అంబేడ్కర్ గురుకులంలో జరిగే ఇంటర్వ్యూలకు హాజరుకావాలన్నారు.
News November 23, 2025
టెన్త్, ఐటీఐ అర్హతతో 542 పోస్టులు

బోర్డర్ రోడ్ ఆర్గనైజేషన్లో 542 పోస్టులకు అప్లై చేయడానికి రేపే ఆఖరు తేదీ. టెన్త్, ఐటీఐ అర్హతగల పురుషులు అప్లై చేసుకోవచ్చు. రాత పరీక్ష, సర్టిఫికెట్ వెరిఫికేషన్, పీఈటీ/ట్రేడ్ టెస్ట్, మెడికల్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. దరఖాస్తు ఫీజు రూ.50, SC, STలకు ఫీజు లేదు. దరఖాస్తు హార్డ్ కాపీ, సర్టిఫికెట్ జిరాక్స్లను స్పీడ్ పోస్ట్ ద్వారా పంపాలి. మరిన్ని జాబ్స్ నోటిఫికేషన్ల కోసం <<-se_10012>>జాబ్స్<<>> కేటగిరీకి వెళ్లండి.
News November 23, 2025
ఓరుగల్లులో ‘ఢీ’సీసీ కుంపటి..!

ఉమ్మడి జిల్లాలో కాంగ్రెస్ కొత్త జిల్లా అధ్యక్షులను నియమించింది. విధేయతకు ప్రాధాన్యం ఇస్తూ సామాజిక సమీకరణాలను పాటించింది. MHBD, జనగామలో ST మహిళలకు, WGLలో మైనార్టీ కోటాలో అయూబ్కు అధ్యక్ష పదవీ దక్కింది. కాగా మరో ఛాన్స్ కోసం చూసిన ఎర్రబెల్లి స్వర్ణకు చుక్కెదురైంది. తనకు రెండో సారి DCC ఇవ్వకపోవడంతో నొచ్చుకున్నట్టు తెలుస్తోంది. సీతక్క మాత్రం తన అనుచరుడికి రెండో సారి DCC ఇప్పించుకోవడంలో సక్సెస్ అయ్యారు.


