News March 20, 2025

MNCL: ‘9,419 మంది పదో తరగతి పరీక్షలు రాస్తున్నారు’

image

జిల్లాలో ఈ నెల 21 నుంచి జరగనున్న పదవ తరగతి వార్షిక పరీక్షలకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు మంచిర్యాల డీఈఓ ఎస్.యాదయ్య తెలిపారు. 49 పరీక్ష కేంద్రాల్లో ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.30 వరకు పరీక్షలు జరుగుతాయన్నారు. మొత్తం 9,198 మంది రెగ్యులర్, 221 మంది ఫెయిలైన విద్యార్థులు పరీక్షలు రాయనున్నారని, పరీక్షా కేంద్రంలోకి సెల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ పరికరాలు తీసుకురావద్దని సూచించారు.

Similar News

News November 11, 2025

ధాన్యం కొనుగోలు కేంద్రంలో కలెక్టర్‌ ఆకస్మిక తనిఖీ

image

యాదాద్రి భువనగిరి(D) బీబీనగర్‌(M) రుద్రవెల్లిలోని ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కలెక్టర్ హనుమంత రావు మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. కేంద్రానికి వచ్చిన, ఇంకా రావాల్సిన ధాన్యం వివరాలను ఆయన అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రతిరోజు తేమశాతం తప్పనిసరిగా తనిఖీ చేసి, నాణ్యత కలిగిన ధాన్యాన్ని వెంటనే కాంటా వేయాలని ఆదేశించారు. కొనుగోలు చేసిన ధాన్యాన్ని అదే రోజు లారీలలో మిల్లులకు తరలించాలన్నారు.

News November 11, 2025

అన్ని దేశాల టెకీలకు స్వర్గధామం మన HYD

image

చైనా, జపాన్, రష్యా, ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, న్యూజిలాండ్, యునైటెడ్ కింగ్డమ్ సహా అనేక దేశాల టెకీలకు అనువైన ప్రాంతాల జాబితాలో HYD నిలిచింది. ఇతర దేశాల టెక్నికల్ ఇంజినీర్లు సైతం HYDకి ట్రాన్స్‌ఫర్ పెట్టుకుని, అద్భుతమైన వాతావరణాన్ని ఆస్వాదిస్తున్నట్లుగా UK టీకి అశ్విన్‌రాజ పవన్ తెలిపారు. ఇతర దేశాలతో పోల్చితే HYDలో తక్కువ ఖర్చుతో, ఆనందంగా బతకడం చాలా ఈజీ అని చెప్పుకొచ్చారు.

News November 11, 2025

అన్ని దేశాల టెకీలకు స్వర్గధామం మన HYD

image

చైనా, జపాన్, రష్యా, ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, న్యూజిలాండ్, యునైటెడ్ కింగ్డమ్ సహా అనేక దేశాల టెకీలకు అనువైన ప్రాంతాల జాబితాలో HYD నిలిచింది. ఇతర దేశాల టెక్నికల్ ఇంజినీర్లు సైతం HYDకి ట్రాన్స్‌ఫర్ పెట్టుకుని, అద్భుతమైన వాతావరణాన్ని ఆస్వాదిస్తున్నట్లుగా UK టీకి అశ్విన్‌రాజ పవన్ తెలిపారు. ఇతర దేశాలతో పోల్చితే HYDలో తక్కువ ఖర్చుతో, ఆనందంగా బతకడం చాలా ఈజీ అని చెప్పుకొచ్చారు.