News March 20, 2025
MNCL: ‘9,419 మంది పదో తరగతి పరీక్షలు రాస్తున్నారు’

జిల్లాలో ఈ నెల 21 నుంచి జరగనున్న పదవ తరగతి వార్షిక పరీక్షలకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు మంచిర్యాల డీఈఓ ఎస్.యాదయ్య తెలిపారు. 49 పరీక్ష కేంద్రాల్లో ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.30 వరకు పరీక్షలు జరుగుతాయన్నారు. మొత్తం 9,198 మంది రెగ్యులర్, 221 మంది ఫెయిలైన విద్యార్థులు పరీక్షలు రాయనున్నారని, పరీక్షా కేంద్రంలోకి సెల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ పరికరాలు తీసుకురావద్దని సూచించారు.
Similar News
News September 18, 2025
HNK: కొడుకును సమర్థించారు.. కటకటాల పాలయ్యారు!

హనుమకొండ జిల్లా వేలేరు మండలానికి చెందిన తరుణ్, రాజులు ఓ గ్రామానికి చెందిన బాలికకు సైగలు చేస్తూ వేధించేవారు. నిందితుల తల్లిదండ్రులకు చెప్పగా వారి కొడుకులను సమర్థించారు. దీంతో బాలిక తండ్రి ఇచ్చిన ఫిర్యాదుతో సమ్మయ్య, ఇందిరమ్మలతో కలిపి నలుగురిపై పోక్సో కేసు నమోదైంది. మూడేళ్ల జైలు, రూ.12వేల జరిమానా వేస్తూ HNK జిల్లా మొదటి అదనపు సెషన్స్ జడ్జి అపర్ణ దేవి తీర్పు ఇచ్చారు.
News September 18, 2025
బాల్మర్ లారీలో ఉద్యోగాలు

<
News September 18, 2025
జగన్ అసెంబ్లీకి వస్తారా?

AP: నేటి నుంచి మొదలయ్యే అసెంబ్లీ సమావేశాలకు వైసీపీ చీఫ్ జగన్ హాజరవుతారా అనేదానిపై సస్పెన్స్ నెలకొంది. ప్రతిపక్ష హోదా ఇవ్వాలని ఆయన కోరుతుండగా కూటమి ప్రభుత్వం మాత్రం అర్హత లేదని చెబుతోంది. అటు అసెంబ్లీకి వెళ్లొద్దని YCP ఎమ్మెల్యేలను జగన్ ఆదేశించినట్లు సమాచారం. దీంతో ఎప్పటిలాగే పార్టీ నుంచి మండలి సభ్యులే హాజరవుతారని తెలుస్తోంది. దీనిపై మరికాసేపట్లో క్లారిటీ రానుంది.