News February 4, 2025

MNCL: FEB 5 నుంచి సదరం శిబిరాలు

image

మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ప్రభత్వ ఆసుపత్రిలో ఈ నెల 5 నుంచి సదరం శిబిరం నిర్వహిస్తున్నట్లు జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారి కిషన్ తెలిపారు. 5న మూగ, చెవుడు, 11, 19 తేదీల్లో శారీరక దివ్యాంగులు, 25న మానసిక వికలాంగులు, 28న కంటి చూపు సమస్య ఉన్న వారు హాజరు కావాలని పేర్కొన్నారు. కొత్త సదరం సర్టిఫికెట్‌తో పాటు రెన్యూవల్ కోసం ఈ నెల 4 నుంచి మీ సేవలో స్లాట్ బుక్ చేసుకోవాలని సూచించారు.

Similar News

News November 25, 2025

కామారెడ్డి: రోడ్డు ప్రమాదంలో నవ వధువు మృతి

image

సిద్దిపేట జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో KMR(D)కు చెందిన నవవధువు మృతి చెందింది. పోలీసుల వివరాల ప్రకారం..బిచ్కుందకు చెందిన సాయికిరణ్‌కు 4 నెలల క్రితం SDPTకు చెందిన ప్రణతితో పెళ్లైంది. వీరిద్దరూ HYDలో ఉద్యోగం చేస్తున్నారు. SDPTలో ఓ ఫంక్షన్‌కు ‌హజరైన దంపతులు నిన్న బైకుపై HYD వెళ్తుండగా పెద్దచెప్యాల వద్ద ట్రాక్టర్ వెనక నుంచి వచ్చి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ప్రణతి మృతి చెందగా, సాయికిరణ్ గాయపడ్డాడు.

News November 25, 2025

సూర్యాపేట: నామినేషన్ వేస్తే ఏకగ్రీవమే!

image

త్వరలో జరగనున్న పంచాయతీ ఎన్నికల్లో నూతనకల్ మండలం పెదనెమిల జీపీలో ఓ విచిత్ర పరిస్థితి నెలకొంది. పెదనెమిల జీపీలోని 1వ వార్డు ఎస్టీ జనరల్‌కు రిజర్వ్ అయింది. అయితే గ్రామంలో ఎస్టీ వర్గానికి చెందిన ఓటరు ఒక్కరే ఉండటం విశేషం. నామినేషన్ వేసే ప్రక్రియ పూర్తయితే, వార్డు మెంబర్ ఏకగ్రీవం కానుంది.

News November 25, 2025

తిరుపతి మీదుగా బుల్లెట్ ట్రైన్

image

హైదరాబాద్-చెన్నై బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు ఫైల్స్ వేగంగా ముందుకు కదులుతున్నాయి. సంబంధిత అలైన్‌మెంట్‌ను తమిళనాడు ప్రభుత్వానికి SCR పంపింది. ముందుగా గూడూరు స్టాఫింగ్ అనుకునప్పటికీ తిరుపతిలో స్టాఫింగ్ ఉండేలా ప్లాన్ చేయాలని TN ప్రభుత్వం కోరింది. త్వరలోనే ఈ DPR పూర్తి కానుంది. ఈ రెండు నగరాల మధ్య ప్రయాణం 12గంటలుండగా బుల్లెట్ ట్రైన్‌లో కేవలం 2.20 గంటల్లోనే చేరుకోవచ్చు. ఈ మార్గంలో 11.6KM సొరంగం ఉంటుంది.