News February 4, 2025

MNCL: FEB 5 నుంచి సదరం శిబిరాలు

image

మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ప్రభత్వ ఆసుపత్రిలో ఈ నెల 5 నుంచి సదరం శిబిరం నిర్వహిస్తున్నట్లు జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారి కిషన్ తెలిపారు. 5న మూగ, చెవుడు, 11, 19 తేదీల్లో శారీరక దివ్యాంగులు, 25న మానసిక వికలాంగులు, 28న కంటి చూపు సమస్య ఉన్న వారు హాజరు కావాలని పేర్కొన్నారు. కొత్త సదరం సర్టిఫికెట్‌తో పాటు రెన్యూవల్ కోసం ఈ నెల 4 నుంచి మీ సేవలో స్లాట్ బుక్ చేసుకోవాలని సూచించారు.

Similar News

News October 14, 2025

గట్టు: ఈరోజే చివరి రోజు.. దరఖాస్తు చేసుకోండి

image

గట్టు మండల కేంద్రంలోని కేజీబీవీ పాఠశాలలో ఇంగ్లిష్ టీచర్ పోస్టుకు గెస్ట్ ఫ్యాకల్టీ పద్ధతిలో బోధన చేయుటకు దరఖాస్తులను తీసుకుంటున్నామని పాఠశాల ఎస్ఓ గోపీలత తెలిపారు. బీఈడీలో ఇంగ్లిష్ చదివి ఉండాలని, టెట్ కూడా అర్హత కలిగి ఉండాలని తెలిపారు. ఈ ఉపాధ్యాయ గెస్ట్ ఫ్యాకల్టీ పోస్ట్‌కు దరఖాస్తు చేసుకోవడానికి ఈ రోజే చివరి అవకాశమని తెలిపారు. పూర్తి వివరాలకు కేజీబీవీ గట్టు పాఠశాలలో సంప్రదించాలని కోరారు.

News October 14, 2025

విశాఖ: రైడెన్‌కు భారీగా రాయితీలు

image

➢విశాఖలో గూగుల్ అనుబంధ సంస్థ రైడెన్‌కు ప్రభుత్వం 480 ఎకరాలను కేటాయింపు
➢ఈ భూములకు స్టాంపు డ్యూటీ 100% మినహాయింపు
➢ప్లాంటు మినషనరీ ఖర్చులో 10% మూలధన రాయితీ
➢ఆపరేషన్ యాజమాన్య నిర్వహణ ఛార్జీలు ప్రతి మూడేళ్లకు 5% చొప్పున పెంపు
➢డేటా సెంటర్ నిర్మాణం కోసం రూ.2,245 కోట్ల GSTకి మినహాయింపు
➢ఐదేళ్ల పాటు లీజులపై చెల్లించే GST మినహాయింపు
➢నీటి చార్జీపై పదేళ్లపాటు 25% రాయితీ

News October 14, 2025

ఏలూరు: హేలాపురి ఉత్సవాలను ప్రారంభించిన కలెక్టర్

image

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకొచ్చిన జీఎస్టీ సంస్కరణలపై ప్రతి ఒక్కరికి అవగాహన కలిగినప్పుడే సదరు కార్యక్రమం ఉద్దేశం నెరవేరుతుందని కలెక్టర్ వెట్రిసెల్వి అన్నారు. ఏలూరు గిరిజన భవన్‌లో సోమవారం హేలాపురి ఉత్సవాలు, గ్రాండ్ షాపింగ్ ఫెస్టివల్స్‌ను జిల్లా పరిషత్ ఛైర్ పర్సన్ గంటా పద్మశ్రీతో కలిసి కలెక్టర్ ప్రారంభించారు. సూపర్ జీఎస్టీ పై ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించాలని కలెక్టర్ వెట్రిసెల్వి అన్నారు.