News February 4, 2025
MNCL: FEB 5 నుంచి సదరం శిబిరాలు

మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ప్రభత్వ ఆసుపత్రిలో ఈ నెల 5 నుంచి సదరం శిబిరం నిర్వహిస్తున్నట్లు జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారి కిషన్ తెలిపారు. 5న మూగ, చెవుడు, 11, 19 తేదీల్లో శారీరక దివ్యాంగులు, 25న మానసిక వికలాంగులు, 28న కంటి చూపు సమస్య ఉన్న వారు హాజరు కావాలని పేర్కొన్నారు. కొత్త సదరం సర్టిఫికెట్తో పాటు రెన్యూవల్ కోసం ఈ నెల 4 నుంచి మీ సేవలో స్లాట్ బుక్ చేసుకోవాలని సూచించారు.
Similar News
News January 4, 2026
ఇంద్రవెల్లి: పాముకాటుతో బాలుడి మృతి

ఇంద్రవెల్లి మండలం సకారాం తాండకు చెందిన దయారాం భాగ్యశ్రీ దంపతులకు కుమారుడు విశ్వనాథ్ (4) పాము కాటుతో మృతి చెందాడు. శుక్రవారం పిల్లలతో కలిసి రేగి పండ్లు చెట్టు వద్దకు వెళ్లి పండ్లు తింటున్న సమయంలో పాము కాటేసింది. వెంటనే ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకువెళ్లి వైద్యం చేయించగా చికిత్స పొందుతూ మృతి చెందినట్లు కుటుంబీకులు తెలిపారు.
News January 4, 2026
పాక్ తరహాలోనే బంగ్లాతోనూ క్రికెట్ కష్టమే!

పాక్ తరహాలోనే బంగ్లాదేశ్తోనూ భారత్ ద్వైపాక్షిక సిరీస్లు ఆడటం కష్టంగానే కనిపిస్తోంది. బంగ్లాలో హిందువులపై జరుగుతున్న దాడులే దానికి కారణం. SEPలో భారత్ తమ దేశంలో పర్యటిస్తుందని BCB ప్రకటించింది. కానీ BCCI దానిని కన్ఫామ్ చేయలేదు. పైగా IPL నుంచి బంగ్లా ఆటగాడు ముస్తఫిజుర్ను తప్పించారు. దీంతో బంగ్లా కూడా T20WC మ్యాచులు భారత్లో ఆడకూడదని, తమ వేదికలు మార్చాలని ICCని కోరాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.
News January 4, 2026
జనవరి 4: చరిత్రలో ఈరోజు

* 1643: శాస్త్రవేత్త ఐజాక్ న్యూటన్(ఫొటోలో లెఫ్ట్) జననం
* 1809: బ్రెయిలీ లిపి సృష్టికర్త లూయీ బ్రెయిలీ జననం
* 1889: భారతదేశ రెండవ ప్రధాన న్యాయమూర్తి ఎం.పతంజలి శాస్త్రి జననం
* 1945: నటుడు, దర్శకుడు ఎస్.కె.మిశ్రో జననం
* 1994: సంగీత దర్శకుడు రాహుల్ దేవ్ బర్మన్ మరణం
* 2015: నటుడు ఆహుతి ప్రసాద్ మరణం
– ప్రపంచ బ్రెయిలీ దినోత్సవం


