News February 4, 2025

MNCL: FEB 5 నుంచి సదరం శిబిరాలు

image

మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ప్రభత్వ ఆసుపత్రిలో ఈ నెల 5 నుంచి సదరం శిబిరం నిర్వహిస్తున్నట్లు జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారి కిషన్ తెలిపారు. 5న మూగ, చెవుడు, 11, 19 తేదీల్లో శారీరక దివ్యాంగులు, 25న మానసిక వికలాంగులు, 28న కంటి చూపు సమస్య ఉన్న వారు హాజరు కావాలని పేర్కొన్నారు. కొత్త సదరం సర్టిఫికెట్‌తో పాటు రెన్యూవల్ కోసం ఈ నెల 4 నుంచి మీ సేవలో స్లాట్ బుక్ చేసుకోవాలని సూచించారు.

Similar News

News December 4, 2025

సికింద్రాబాద్‌ దూరం.. కొత్త జోన్ కోరుతున్న జనం!

image

సికింద్రాబాద్‌ జోన్ పరిధిలోకి బోడుప్పల్, జవహర్‌నగర్, నాగారం, తూంకుంట విలీనమైన విషయం తెలిసిందే. శివారు ప్రాంతాలకు సికింద్రాబాద్‌ జోన్ కార్యాలయం దగ్గరగా లేకపోవడంతో, ప్రజలకు అవసరమైన సేవలు పొందడం సవాలుగా మారిందన్న చర్చలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో విలీనమైన 4 పుర, నగర పాలక సంస్థల్లో ఏదో ఒకదాన్ని కొత్త జోన్‌గా ప్రకటించాలన్న డిమాండ్లు జోరందుకున్నాయి. మరి కొత్త జోన్ ఏర్పాటుపై మీ కామెంట్?

News December 4, 2025

సికింద్రాబాద్‌ దూరం.. కొత్త జోన్ కోరుతున్న జనం!

image

సికింద్రాబాద్‌ జోన్ పరిధిలోకి బోడుప్పల్, జవహర్‌నగర్, నాగారం, తూంకుంట విలీనమైన విషయం తెలిసిందే. శివారు ప్రాంతాలకు సికింద్రాబాద్‌ జోన్ కార్యాలయం దగ్గరగా లేకపోవడంతో, ప్రజలకు అవసరమైన సేవలు పొందడం సవాలుగా మారిందన్న చర్చలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో విలీనమైన 4 పుర, నగర పాలక సంస్థల్లో ఏదో ఒకదాన్ని కొత్త జోన్‌గా ప్రకటించాలన్న డిమాండ్లు జోరందుకున్నాయి. మరి కొత్త జోన్ ఏర్పాటుపై మీ కామెంట్?

News December 4, 2025

పాడేరు: రైతులకు కలెక్టర్ అకగాహన సదస్సు

image

ప్రజలు ఆరోగ్యంగా, సుఖసంతోషాలతో జీవించాలంటే రైతులు సేంద్రియ వ్యవసాయం ద్వారా పండించిన పంటలు, మిల్లెట్లను వినియోగించాలని కలెక్టర్ దినేష్ కుమార్ అన్నారు. రైతులు అధిక లాభాలు ఆర్జీచాలంటే సేంద్రియ వ్యవసాయం తప్పనిసరి అన్నారు. బుధవారం గుత్తులుపుట్టులో రైతన్నా మీకోసం ముగింపు కార్యక్రమం నిర్వహించారు. నీటి భద్రత, డిమాండ్, ఉద్యాన ఆధారిత పంటలు, ఫుడ్ ప్రాసెసింగ్ అంశాలపై రైతులకు అవగాహన కల్పించారు.