News February 4, 2025
MNCL: FEB 5 నుంచి సదరం శిబిరాలు

మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ప్రభత్వ ఆసుపత్రిలో ఈ నెల 5 నుంచి సదరం శిబిరం నిర్వహిస్తున్నట్లు జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారి కిషన్ తెలిపారు. 5న మూగ, చెవుడు, 11, 19 తేదీల్లో శారీరక దివ్యాంగులు, 25న మానసిక వికలాంగులు, 28న కంటి చూపు సమస్య ఉన్న వారు హాజరు కావాలని పేర్కొన్నారు. కొత్త సదరం సర్టిఫికెట్తో పాటు రెన్యూవల్ కోసం ఈ నెల 4 నుంచి మీ సేవలో స్లాట్ బుక్ చేసుకోవాలని సూచించారు.
Similar News
News November 23, 2025
ఉపాధి హామీ పథకం.. 48 గంటల్లో కొత్త కార్డు

AP: ఉపాధి హామీ పథకం కింద కొత్త జాబ్ కార్డుల జారీ, బోగస్ కార్డుల తొలగింపునకు ప్రభుత్వం స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తోంది. ఈకేవైసీ ప్రక్రియతో అధికారులు 7.44 లక్షల బోగస్ కార్డులను గుర్తించి రద్దు చేశారు. తొలగించిన కార్డుల వివరాలను గ్రామాల్లో వారం రోజులు ప్రదర్శిస్తారు. కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారికి 48 గంటల్లో కార్డులు మంజూరు చేస్తారు. ఈ ఏడాది కొత్తగా 3.47L మందికి ప్రభుత్వం కార్డులు ఇచ్చింది.
News November 23, 2025
WGL: పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్లు.. ఉత్కంఠ

పంచాయతీ ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం శనివారం రిజర్వేషన్లపై జీవో విడుదల చేసింది. మొత్తం రిజర్వేషన్లు 50% లోపే ఉండేలా నిర్ణయించింది. వార్డు సభ్యుల SC, ST, BC రిజర్వేషన్లు తాజా కులగణన ఆధారంగా, సర్పంచ్ పదవుల్లో బీసీ రిజర్వేషన్ కులగణన ప్రకారం, ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లు 2011 జనాభా లెక్కల ప్రకారం అమలు కానున్నాయి. మహిళా రిజర్వేషన్లకు లాటరీ విధానం పాటించనుంది. దీంతో ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉత్కంఠ నెలకొంది.
News November 23, 2025
అల్పపీడనం.. అతి భారీ వర్షాలు

AP: ద.అండమాన్ సముద్ర పరిసరాల్లో అల్పపీడనం ఏర్పడిందని IMD వెల్లడించింది. ఇది రేపటికి వాయుగుండంగా, ఈనెల 30 నాటికి తుఫానుగా మారుతుందని అంచనా వేసింది. ఉత్తర కోస్తాకు తుఫాను ముప్పు పొంచి ఉందని, NOV 28 నుంచి వర్షాలు పెరుగుతాయని తెలిపింది. అలాగే ఉత్తరాంధ్రలో భారీ-అతిభారీ వర్షాలు పడతాయని పేర్కొంది. ఇవాళ ప్రకాశం, నెల్లూరు, KDP, అన్నమయ్య, చిత్తూరు, TPT జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని APSDMA ప్రకటించింది.


