News April 5, 2025

MNCL: GREAT.. 50 ఏళ్ల తర్వాత కలుసుకున్నారు..!

image

మంచిర్యాల పట్టణంలోని జడ్పీ బాలుర పాఠశాలలో 1975లో 10వ తరగతి చదువుకున్న పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం శుక్రవారం నిర్వహించారు. తాము చదువుకున్న పాఠశాలకు అవసరమైన 30 ఫర్నీచర్ కుర్చీలు, ఫోడియం, విద్యార్థులకు డిక్షనరీలు, బిస్కెట్ ప్యాకెట్లు అందజేశారు. పూర్వ ఉపాధ్యాయులను సత్కరించి, మోమెంటోలు ప్రదానం చేశారు. నిర్వాహకులు రాజగోపాల్, వి.మధుసూదన్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Similar News

News November 6, 2025

మరిపెడ: ACBకి చిక్కిన AEO

image

మరిపెడ మండల కేంద్రంలో గురువారం ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. నిలికుర్తి గ్రామానికి చెందిన రైతు నుంచి వ్యవసాయ విస్తరణ అధికారి(AEO) గాడిపెల్లి సందీప్ రూ.10 వేల లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కాడు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

News November 6, 2025

DANGER: CT స్కాన్ చేయిస్తున్నారా?

image

ఏదైనా చిన్న సమస్యతో ఆస్పత్రికి వెళ్తే సీటీ స్కాన్, MRIలను వైద్యులు సజెస్ట్ చేస్తుంటారు. అయితే CT స్కాన్‌ల నుంచి వెలువడే రేడియేషన్ వల్ల క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. భవిష్యత్తులో వచ్చే మొత్తం క్యాన్సర్ సంఖ్యల్లో CT స్కాన్ క్యాన్సర్లు 5 శాతానికి చేరొచ్చని అమెరికాలో జరిగిన అధ్యయనంలో తెలిసినట్లు పేర్కొన్నారు. CT స్కాన్‌ల వినియోగం, డోసులు తగ్గించకపోతే ప్రమాదమేనంటున్నారు.

News November 6, 2025

HYD: చీమలకు భయపడి వివాహిత సూసైడ్

image

చీమలకు భయపడి వివాహిత ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన అమీన్‌పూర్‌లో పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. నవ్య హోమ్స్‌లో నివసిస్తున్న మనీషా (25) ఫోబియా‌తో చీమలకు భయపడి ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. మనీషా 2022లో చిందం శ్రీకాంత్‌(35)ను వివాహం చేసుకుంది. వీరికి కుమార్తె అన్వీ(3) ఉంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.