News April 5, 2025
MNCL: GREAT.. 50 ఏళ్ల తర్వాత కలుసుకున్నారు..!

మంచిర్యాల పట్టణంలోని జడ్పీ బాలుర పాఠశాలలో 1975లో 10వ తరగతి చదువుకున్న పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం శుక్రవారం నిర్వహించారు. తాము చదువుకున్న పాఠశాలకు అవసరమైన 30 ఫర్నీచర్ కుర్చీలు, ఫోడియం, విద్యార్థులకు డిక్షనరీలు, బిస్కెట్ ప్యాకెట్లు అందజేశారు. పూర్వ ఉపాధ్యాయులను సత్కరించి, మోమెంటోలు ప్రదానం చేశారు. నిర్వాహకులు రాజగోపాల్, వి.మధుసూదన్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
Similar News
News December 22, 2025
ఖమ్మంలో ‘శిల్పారామం’

ఖమ్మంలో శిల్పారామం ఏర్పాటుకు ముహూర్తం కుదిరింది. ఖానాపురం హవేలీ పరిధిలోని సర్వే నం. 94, 234లో 5.04 ఎకరాల ప్రభుత్వ భూమిని కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్నారు. మంత్రి తుమ్మల ఆదేశాల మేరకు అధికారులు పరిశీలన పూర్తి చేశారు. శిల్పారామం ముఖద్వారానికి సంబంధించిన నమూనాను తక్షణమే సిద్ధం చేసి, పనులను పట్టాలెక్కించాలని నిర్ణయించారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే నగరం పర్యాటక, సాంస్కృతిక కేంద్రంగా రూపుదిద్దుకోనుంది.
News December 22, 2025
శ్రీకాకుళం జిల్లాలో జోరుగా ఇసుక అక్రమ దందా

శ్రీకాకుళం జిల్లాలో రాజకీయ అండతో కొందరు మాఫియాగా మారి ఇసుక అక్రమ దందా సాగిస్తున్నారు. శివారు గ్రామాలను డంపింగ్ కేంద్రాలుగా మార్చి గుట్టుచప్పుడు కాకుండా రాత్రి వేళల్లో భారీ లారీలతో ఒడిశా, హైదరాబాద్లకు రవాణా చేస్తున్నట్లు ఊహగానాలున్నాయి. దీంతో నదీ పరీవాహక భూములు కోతకు గురవుతున్నాయి. అధికారికంగా 27 ర్యాంపుల్లో 4.50లక్షల క్యూబిక్ మీటర్ల ఇసుక తరలగా, అనధికారకంగా లక్షల క్యూబిక్ మీటర్లు తరలిందని సమాచారం.
News December 22, 2025
అన్నమయ్య: రేపు బంద్

అన్నమయ్య జిల్లా కేంద్రంగా రాజంపేటను ప్రకటించాలని ఆ ప్రాంత వాసులు పోరాటాలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఉద్యమాన్ని మరింత ఉద్ధృతం చేస్తున్నారు. రేపు రాజంపేట బంద్కు JAC నేతలు పిలుపునిచ్చారు. ఈ బంద్కు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. రాజంపేటకు ద్రోహం చేసిన YCP ఎమ్మెల్యే, MPలు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. YCP అన్యాయం చేసింది మీరైనా న్యాయం చేయండి అంటూ CM చంద్రబాబుకు విజ్ఞప్తి చేశారు.


