News April 3, 2025
MNCL: KU.. గడువు మరోసారి పొడిగింపు

కాకతీయ యూనివర్సిటీ పరిధిలో డిగ్రీ 2, 4, 6 సెమిస్టర్ల పరీక్ష ఫీజు చెల్లింపు గడువును మరోసారి పొడిగిస్తున్నట్లు KU అధికారులు పేర్కొన్నారు. నేటితో ఈ గడువు ముగియనుండగా ఏప్రిల్ 7 వరకు ఎలాంటి అపరాధ రుసుము లేకుండా చెల్లించవచ్చని పేర్కొన్నారు. రూ.50 ఫైన్తో ఏప్రిల్ 9 వరకు అవకాశం కల్పించినట్లు వెల్లడించారు. ఉమ్మడి జిల్లా విద్యార్థులు ఈ విషయాన్ని గమనించాలని సూచించారు.
Similar News
News February 26, 2026
నారాయణపేట కొత్త కలెక్టర్గా ప్రతీక్ జైన్ నియామకం

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా జరిగిన ఐఏఎస్ అధికారుల బదిలీల్లో భాగంగా,నారాయణపేట జిల్లాకు నూతన కలెక్టర్ను ప్రభుత్వం నియమించింది.ఇప్పటివరకు వికారాబాద్ జిల్లా కలెక్టర్గా పనిచేస్తున్న ప్రతీక్ జైన్ను నారాయణపేట జిల్లాకు బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.నారాయణపేట కలెక్టర్గా పనిచేసిన సిక్తా పట్నాయక్ బదిలీ కావడంతో, ఆ స్థానంలో ప్రతీక్ జైన్ బాధ్యతలు స్వీకరించనున్నారు.
News February 26, 2026
NCERT బుక్పై వివాదం.. కాపీలన్నీ వెనక్కి!

8వ తరగతి సోషల్ సైన్స్ పుస్తకంలో కొత్తగా చేర్చిన <<19237804>>‘న్యాయవ్యవస్థలో అవినీతి’<<>> పాఠ్యాంశంపై కేంద్రం అభ్యంతరం తెలపడంతో NCERT దిద్దుబాటు చర్యలు చేపట్టింది. మొత్తం 2.25 లక్షల కాపీలను ముద్రించగా ఇప్పటికే 2,24,962 కాపీలను వేర్హౌస్కు తిరిగి పంపినట్లు విద్యా మంత్రిత్వ శాఖ వర్గాలు వెల్లడించాయి. బయటికి వెళ్లిన 38 కాపీలను వెనక్కి తెప్పించేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిపింది.
News February 26, 2026
మహబూబ్నగర్ కలెక్టర్గా ఖుష్బూ గుప్త

మహబూబ్నగర్ జిల్లా కలెక్టర్గా ఖుష్బూ గుప్తను ప్రభుత్వం నియమించింది. రాష్ట్రవ్యాప్తంగా జరిగిన ఐఏఎస్ అధికారుల బదిలీల్లో భాగంగా ఈ మేరకు ఉత్తర్వులు వెలువడ్డాయి. ఇప్పటివరకు ఇక్కడ కలెక్టర్గా సేవలందించిన విజయేందిర బదిలీ కావడంతో, ప్రభుత్వం ఖుష్బూ గుప్తకు ఈ కీలక బాధ్యతలు అప్పగించింది. గతంలో వివిధ హోదాల్లో సమర్థవంతంగా పనిచేసిన ఆమె, జిల్లా అభివృద్ధిపై తనదైన ముద్ర వేస్తారని అధికార వర్గాలు భావిస్తున్నాయి.


