News March 26, 2025

MNCL: KU సెమిస్టర్స్ ఫీజు చెల్లింపు గడువు పొడిగింపు

image

కాకతీయ యూనివర్సిటీ పరిధిలో డిగ్రీ 2, 4, 6 సెమిస్టర్ల పరీక్ష ఫీజు చెల్లింపు గడువును పొడిగిస్తున్నట్లు KU అధికారులు పేర్కొన్నారు. నిన్నటితో ఈ గడువు ముగియగా ఏప్రిల్ 2 వరకు ఎలాంటి అపరాధ రుసుము లేకుండా, రూ.50 ఫైన్‌తో ఏప్రిల్ 9 వరకు అవకాశం కల్పించినట్లు వెల్లడించారు.

Similar News

News November 16, 2025

రాజ్యసభలో పెరగనున్న NDA బలం

image

బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో విజయంతో రాజ్యసభలో NDA బలం పెరగనుంది. రాష్ట్రంలో ఐదింటికి వచ్చే ఏడాది, మిగతా 5 స్థానాలకు 2028లో ఎలక్షన్ జరగాల్సి ఉంది. వీటన్నింటినీ NDA చేజిక్కించుకునే అవకాశం ఉంది. ఇందులో ప్రతిపక్ష RJD తన 3 సీట్లను కోల్పోనుంది. ఒక సీటును నిలబెట్టుకోవాలంటే కనీసం 42 మంది MLAలు ఉండాలి. కానీ RJD గెలిచింది 25 సీట్లే. 245 మంది సభ్యులు ఉండే రాజ్యసభలో ఎన్డీయేకు 133 మంది ఎంపీలు ఉన్నారు.

News November 16, 2025

HYD: వ్యర్థాలపై యోగా.. ఎంటనుకుంటున్నారా?

image

రోడ్డు పక్కన నిర్మాణ వ్యర్థాలపై వ్యక్తి యోగా చేయటం ఏంటని అనుకుంటున్నారా? ఇది నిజమే. శేర్లింగంపల్లి జోన్ కల్వరి టెంపుల్ రోడ్డులో ఓవైపు నిర్మాణ వ్యర్థాల, మరోవైపు డ్రైనేజీ సిల్ట్ రోడ్డుకు ఇరుపక్కల మీటర్ల కొద్ది ఉండటంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. అయినా ఎవరూ పట్టించుకోకపోవడంతో సూర్య కిరణాలు శరీరాన్ని తాకేలా ఆ వ్యర్థాలపై యోగా చేస్తూ పరిస్థితిని వివరించారు.

News November 16, 2025

KNR: దివ్యాంగురాలి అనుమానాస్పద మృతి

image

KNRలోని వావిలాలపల్లిలో శనివారం దివ్యాంగురాలైన అర్చన(15) అనుమానాస్పదంగా మృతిచెందింది. ఆమె సోదరుడు అశ్రిత్ పరిస్థితి విషమంగా ఉంది. తల్లి కిరాణా షాప్‌కు వెళ్లి వచ్చేసరికి ఇద్దరూ స్పృహ కోల్పోయి కనిపించారు. ఆసుపత్రికి తరలించగా అర్చన చనిపోయినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఘటన జరిగినప్పటి నుంచి వారి తండ్రి మల్లేషం కనిపించడం లేదు. KNR-3 టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.