News February 11, 2025

MNCL: MLC అభ్యర్థిగా నామినేషన్ వేసిన శేఖర్‌రావు

image

పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా ట్రస్మా రాష్ట్ర అధ్యక్షుడు యాదగిరి శేఖర్ రావు నామినేషన్ వేశారు. జన్నారం మండలంలోని కలమడుగు గ్రామానికి చెందిన యాదగిరి శేఖర్ రావు సోమవారం కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతికి నామినేషన్ పత్రాలను అందించారు. శేఖర్ రావు మాట్లాడుతూ.. నిరుద్యోగులు, పట్టభద్రుల సమస్యలను పరిష్కరించడానికి తాను పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నానని వెల్లడించారు.

Similar News

News November 27, 2025

విదేశీ పెట్టుబడులకు రాష్ట్రం అనుకూలం: శ్రీధర్ బాబు

image

విదేశీ పెట్టుబడులకు తెలంగాణ అనుకూల గమ్యస్థానమని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు వెల్లడించారు. ఐటీ, ఏరోస్పేస్, మ్యాన్యుఫ్యాక్చరింగ్, ఫార్మా రంగాలకు ఎకో సిస్టమ్‌ను రాష్ట్రంలో అభివృద్ధి చేసినట్లు తెలిపారు. HYD సచివాలయంలో గురువారం జర్మన్ ఫ్రీడరిక్- ఎబర్ట్- స్టిఫ్టంగ్ ఫౌండేషన్ ప్రతినిధులు డా.సబీన్ ఫాండ్రిక్ మిర్కో గుంథర్, క్రిస్టోఫ్ మోహ్ర్ చర్చించారు. ఆయనతో పాటు పాటు RGM MLA మక్కన్ సింగ్ ఠాకూర్ ఉన్నారు.

News November 27, 2025

కోదాడ: హోరా హోరీగా జాతీయ స్థాయి క్రీడలు

image

కోదాడ సీసీ రెడ్డి పాఠశాలలో 19వ సీఎస్ఏ జాతీయ స్థాయి క్రీడా పోటీలు గురువారం రెండో రోజు ఉత్సాహంగా కొనసాగాయి. ప్రిన్సిపల్ ఆన్ జ్యోతి పర్యవేక్షణలో కన్వీనర్ సిస్టర్ ఉడుముల శౌరీలు, సిస్టర్ నక్షత్రం క్రీడలను ప్రారంభించారు. వాలీబాల్, బాస్కెట్‌బాల్, ఖోఖో, కబడ్డీ, త్రోబాల్, అథ్లెటిక్స్‌లో విద్యార్థులు ప్రతిభ చూపించారు. దక్షిణాది రాష్ట్రాల నుంచి వచ్చిన క్రీడాకారులతో పండుగ వాతావరణం నెలకొంది.

News November 27, 2025

కోదాడ: హోరా హోరీగా జాతీయ స్థాయి క్రీడలు

image

కోదాడ సీసీ రెడ్డి పాఠశాలలో 19వ సీఎస్ఏ జాతీయ స్థాయి క్రీడా పోటీలు గురువారం రెండో రోజు ఉత్సాహంగా కొనసాగాయి. ప్రిన్సిపల్ ఆన్ జ్యోతి పర్యవేక్షణలో కన్వీనర్ సిస్టర్ ఉడుముల శౌరీలు, సిస్టర్ నక్షత్రం క్రీడలను ప్రారంభించారు. వాలీబాల్, బాస్కెట్‌బాల్, ఖోఖో, కబడ్డీ, త్రోబాల్, అథ్లెటిక్స్‌లో విద్యార్థులు ప్రతిభ చూపించారు. దక్షిణాది రాష్ట్రాల నుంచి వచ్చిన క్రీడాకారులతో పండుగ వాతావరణం నెలకొంది.