News February 2, 2025

MNCL: MLC ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించాలి:SEO

image

శాసనమండలి ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించాలని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి అన్నారు. శనివారం హైదరాబాద్ నుంచి పట్టభద్రులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణపై వీడియో కాన్ఫరెన్స్ సమీక్షలో మాట్లాడారు. ఎన్నికల ప్రవర్తన నియమావళి కట్టుదిట్టంగా అమలు చేయాలని తెలిపారు. సమావేశంలో జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, తదితరులు పాల్గొన్నారు.

Similar News

News December 23, 2025

రామగుండం పోలీస్ స్టేషన్ సందర్శించిన డీసీపీ

image

పెద్దపల్లి డీసీపీ బి.రామ్ రెడ్డి రామగుండం పోలీస్ స్టేషన్‌ను సందర్శించారు. రిసెప్షన్ సెంటర్‌లో పిటిషన్ల రికార్డులు, నమోదు కేసుల ప్లాన్ ఆఫ్ యాక్షన్, అండర్ ఇన్వెస్టిగేషన్ కేసుల వివరాలు పరిశీలించారు. సిబ్బంది పనితీరు, ప్రజలతో ప్రవర్తన, మహిళా సిబ్బందిని అన్ని డ్యూటీల్లో పాల్గొనడం, ఎలాంటి సమస్యలు ఉన్నాయో అడిగి తెలుసుకున్నారు. ఫిర్యాదులపై తక్షణ చర్యలు తీసుకుని బాధితులకు న్యాయం కల్పించాలని ఆదేశించారు.

News December 23, 2025

బాపట్లలో పర్యాటక రంగ అభివృద్ధికి చర్యలు: కలెక్టర్

image

జిల్లాను పర్యాటక రంగంలో అభివృద్ధి చేయడానికి బాపట్ల కలెక్టర్ డా.వి.వినోద్ కుమార్ ప్రత్యేక దృష్టి సారించారు. సోమవారం నిర్వహించిన PGRSలో కలెక్టర్ పర్యాటక ప్రాంతాల సంరక్షణ, స్వచ్ఛత, మాస్టర్ ప్రణాళిక తయారీపై అధికారులకు మార్గనిర్దేశం చేశారు. సూర్యలంక అభివృద్ధి పనులు ఇప్పటికే మొదలవ్వగా, బీచ్‌ల వద్ద ప్రతి సోమవారం పారిశుద్ధ్య డ్రైవ్ నిర్వహించాలని సూచించారు.

News December 23, 2025

నరమాంస తోడేలు.. తల్లి ఒడిలోని బాలుడిని ఎత్తుకెళ్లి..

image

UPలో నరమాంస తోడేళ్లు స్వైరవిహారం చేస్తున్నాయి. తాజాగా బహ్రైచ్‌(D) రసూల్‌పూర్ దారెహ్తాలో దారుణం జరిగింది. తల్లి ఒడిలో కూర్చోబెట్టుకుని పాలు పడుతుండగా మూడేళ్ల చిన్నారి అన్షుని తోడేలు నోట కరుచుకుని పారిపోయింది. తల్లి దాని వెంట పడినప్పటికీ తెల్లవారుజామున కావడంతో ఆచూకీ దొరకలేదు. కొంతదూరంలో అన్షు మృతదేహాన్ని గ్రామస్థులు గుర్తించారు. ఆ జిల్లాలో తోడేళ్ల దాడిలో 12 మంది చనిపోగా 32 మంది తీవ్రంగా గాయపడ్డారు.