News April 18, 2024

MNCL: ఆర్టీసీ బస్టాండ్‌లో గుర్తు తెలియని వ్యక్తి మృతి

image

మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్‌లో బుధవారం సుమారు 40 ఏళ్ల గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందినట్లు సీఐ బన్సీలాల్ తెలిపారు. బస్టాండ్‌లోని ఆసిఫాబాద్‌కు వెళ్లే ప్లాట్ ఫామ్ వద్ద మరణించిన మృతుని వద్ద ఎలాంటి ఆధారాలు లభించలేదని పేర్కొన్నారు. మృతదేహాన్ని ప్రభుత్వ ఆస్పత్రిలోని మార్చురీ గదిలో భద్రపరిచామని, వివరాలు తెలిసిన వారు పోలీస్ స్టేషన్‌లో సంప్రదించాలని సూచించారు.

Similar News

News October 13, 2024

బాసర అమ్మవారికి దిల్ రాజు పూజలు

image

ప్రసిద్ధ పుణ్యక్షేత్రం బాసర సరస్వతీ అమ్మవారిని ప్రముఖ సినీ నిర్మాత దిల్ రాజు, నటుడు <<14345490>>తనికెళ్ల భరణి<<>> కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. ఆయనతో ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు జరిపించారు. అమ్మవారి తీర్థప్రసాదాలు ఆశీర్వచనాలు అందించారు. అనంతరం బాసర వేదభారతి పీఠాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. సరస్వతీ అమ్మవారి సన్నిధికి రావడం చాలా సంతోషంగా ఉందని దిల్ రాజు అన్నారు.

News October 13, 2024

కడెం ప్రాజెక్టుకు తగ్గుతున్న వరద నీరు

image

ఎగువ ప్రాంతాల్లో వర్షాలు లేనందున కడెం ప్రాజెక్టు వరద తగ్గింది. ప్రాజెక్టులోకి 461 క్యూసెక్కుల వరద మాత్రమే వస్తుందని అధికారులు ఆదివారం ఉదయం వెల్లడించారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి సామర్థ్యం 700 అడుగులు కాగా ప్రస్తుతం 499.350 అడుగుల నీటిమట్టం నిల్వ ఉందన్నారు. ప్రాజెక్టు లెఫ్ట్ రైట్ కెనాళ్లకు 669, మిషన్ భగీరథకు 9 క్యూసెక్కుల నీటిని వదులుతున్నట్లు అధికారులు తెలిపారు.

News October 13, 2024

ఆసిఫాబాద్: ‘లక్మాపూర్ వాగుపై వంతెన నిర్మించాలి’

image

కెరమెరి మండలం లక్మాపూర్ గ్రామస్థులు రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. లక్మాపూర్ వాగుపై వంతెన లేకపోవడంతో ఆసుపత్రికి పోవాలన్నా, నిత్యావసరాలు తెచ్చుకోవాలన్నా ఇక్కట్లు తప్పడం లేదు. శనివారం ఎడ్లబండిపై డీజే బాక్స్ తీసుకెళ్లారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలంటూ వాపోతున్నారు.