News February 23, 2025

MNCL: ఎన్నికలకు సింగరేణి కార్మికులు దూరమేనా..?

image

ఈనెల 27న జరిగే పట్టభద్రుల ఎన్నికలకు సింగరేణి కార్మికులకు యాజమాన్యం ఇప్పటి వరకు స్పెషల్ క్యాజువల్ లీవ్ ప్రకటించకలేదు. దీంతో ఓటు హక్కు వినియోగించుకోలేమని సింగరేణి పట్టభద్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే వివిధ శాఖల ఉద్యోగులకు స్పెషల్ లీవ్‌లు ఇస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి. కానీ సింగరేణి కార్మికులకు స్పెషల్ లీవ్ ఆదేశాల రాలేదని పలువురు కార్మికులు Way2News దృష్టికి తీసుకువచ్చారు.

Similar News

News February 23, 2025

కాంగ్రెస్‌కు దక్కేది గుండు సున్నానే: కిషన్‌రెడ్డి

image

TG: రాష్ట్రంలో బీజేపీ మాత్రమే 3 ఎమ్మెల్సీ స్థానాల్లో పోటీ చేస్తోందని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. విద్యావంతులు, టీచర్లను మోసం చేశాయి కాబట్టే కాంగ్రెస్, బీఆర్ఎస్‌‌లు పూర్తి స్థానాల్లో అభ్యర్థులను నిలిపే సాహసం చేయలేదన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్‌పై తీవ్ర వ్యతిరేకత వచ్చిందని, ఇప్పుడు ఎన్నికలు వస్తే ఆ పార్టీకి ఒక్క సీటు కూడా దక్కదన్నారు.

News February 23, 2025

VKB: క్రికెట్ మ్యాచ్ వీక్షిస్తున్న కబడ్డీ ప్లేయర్లు

image

వికారాబాద్ జిల్లా కేంద్రంలోని గౌలికర్ ఫంక్షన్ హాల్లో 34వ సబ్ జూనియర్ రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా క్రీడాకారుల కోరిక మేరకు నిర్వాహకులు స్క్రీన్ ఏర్పాటు చేశారు. ఇండియా, పాక్ మధ్య పోటీ రసవత్తరంగా ఉంటుందడానికి ఈ ఏర్పాటే నిదర్శనం. ఆదివారం సాయంత్రం కబడ్డీ ఫైనల్ పోటీలు జరగనున్నాయి.

News February 23, 2025

టెక్కలి: ప్రమాదవశాత్తు జారిపడి కూలీ మృతి

image

టెక్కలి జాతీయ రహదారిపై ఆదివారం ప్రమాదవశాత్తు జారిపడి మెలియాపుట్టి మండలం బంజీరు గ్రామానికి చెందిన గూడ మార్కండరావు(36) అనే కూలీ మృతిచెందాడు. గోడౌన్ నుంచి సరకులను ట్రాక్టర్ ద్వారా తీసుకువెళ్లేందుకు రోజుకూలీ డ్రైవర్‌గా ఉన్న ఈయన ప్రమాదవశాత్తు జారిపడిపోవడంతో తలకు బలమైన గాయమైంది. టెక్కలి జిల్లా ఆసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మృతిచెందాడు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

error: Content is protected !!