News March 21, 2025
MNCL: పుట్టెడు దుఃఖంలోనూ పది పరీక్ష రాసింది..!

కన్న తండ్రి మరణం.. మరోవైపు పరీక్ష.. బాధనంతటిని దిగమింగుకొని పరీక్ష రాసింది ఆమె. మనోధైర్యంతో పరీక్షాకేంద్రానికి వెళ్లి కన్నీటిచుక్కలను అక్షరాలుగా మలిచింది విద్యార్థిని శ్రీలత. మంచిర్యాల జిల్లా కన్నెపల్లి మండలం ముత్తాపూర్కు చెందిన మంచర్ల మల్లయ్య(62) గురువారం రాత్రి చనిపోయారు. ఆయన కూతురు శ్రీలత బాధలో కుటుంబీకులు ఇచ్చిన ధైర్యంతో పరీక్ష రాసొచ్చింది. దుఃఖంలోనూ పరీక్ష రాసిన ఆమె ఎంతో గ్రేట్ కదా..!
Similar News
News March 31, 2025
పల్నాడు: రంజాన్ ప్రార్థనలకు వేలాది మంది హాజరు

పల్నాడు జిల్లా వ్యాప్తంగా సోమవారం నిర్వహించిన రంజాన్ పర్వదిన ప్రత్యేక ప్రార్థనలకు ముస్లిం సోదరులు వేలాదిగా హాజరయ్యారు. జిల్లా కేంద్రమైన నరసరావుపేటతో పాటు సత్తెనపల్లి, గురజాల, పిడుగురాళ్ల, వినుకొండ, చిలకలూరిపేట, మాచర్ల నియోజకవర్గ కేంద్రాలలో మసీదులు కిటకిటలాడాయి. మండల కేంద్రాల్లోనూ ప్రత్యేక ప్రార్థనలకు ముస్లిం సోదరులు భారీగా తరలివచ్చారు. మత ప్రవక్తలు రంజాన్ విశిష్టత తెలియజేశారు.
News March 31, 2025
మోనాలిసాకు ఆఫర్ ఇచ్చిన దర్శకుడి అరెస్ట్!

ప్రయాగ్రాజ్ కుంభమేళాలో ఫేమస్ అయిన మోనాలిసాకు సినిమా ఆఫర్ ఇచ్చిన దర్శకుడు సనోజ్ మిశ్రాకు షాక్ తగిలింది. రేప్ కేసులో ఆయనను పోలీసులు అరెస్ట్ చేశారు. తనను డైరెక్టర్ లైంగికంగా వేధించాడని, వీడియోలు తీసి బెదిరించాడని ఓ యువతి ఫిర్యాదుతో ఆయనపై కేసు నమోదైంది. ‘ది డైరీ ఆఫ్ మణిపుర్’ పేరుతో తెరకెక్కించే సినిమాలో మోనాలిసాను హీరోయిన్గా తీసుకుంటున్నట్లు సనోజ్ ప్రకటించారు.
News March 31, 2025
మెరుగైన వైద్యం కోసం ముంబైకి కొడాలి నాని

మాజీ మంత్రి కొడాలి నానిని మెరుగైన వైద్యం కోసం వైద్యులు ముంబైకి తరలిస్తున్నారు. హార్ట్ స్టంట్ లేదా బైపాస్ సర్జరీ అవసరమా అనే విషయాన్ని వైద్యులు పరిశీలిస్తున్నారు. ఈ మేరకు ముంబైలోని ఏషియన్ హార్ట్ ఇన్స్టిట్యూట్కు మాజీ మంత్రి కొడాలి నానిని తరలిస్తున్నారు. కుటుంబ సభ్యులు, అనుచరులు ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నారు.