News April 4, 2025
MNCL: ప్రతి ఉద్యోగికి శిక్షణ అవసరం: DEO

వృత్యంతర శిక్షణ ప్రతి ఉద్యోగికి అత్యవసరమని, నూతన అంశాలు నేర్చుకొని విజ్ఞానాన్ని నవీకరించుకోవడానికి ఎంతో ఉపయోగపడతాయని DEO ఎస్ యాదయ్య అన్నారు. మంచిర్యాలలోని గర్మిళ్ల ప్రభుత్వ ఉన్నత పాఠశాల నిర్వహిస్తున్న 2 రోజుల శిక్షణ శిబిరానికి గురువారం ఆయన హాజరై మాట్లాడారు. ప్రధానోపాధ్యాయులు పాఠశాలకు నాయకులని, వారి నాయకత్వ లక్షణాలు విద్యార్థుల అభివృద్ధికి ఎంతగానో దోహదపడతాయని పేర్కొన్నారు.
Similar News
News December 17, 2025
రాష్ట్రంలో మళ్లీ ఎన్నికలు!

TG: పంచాయతీ ఎన్నికలు ముగుస్తుండటంతో పరిషత్(MPTC, జడ్పీ) ఎలక్షన్స్కు ప్రభుత్వం, ఎన్నికల సంఘం కసరత్తు చేస్తోంది. తాజాగా ఈ ఫైల్ను అధికారులు సీఎంకు పంపారు. రెండు విడతల్లో ఎన్నికలు నిర్వహించాలని ప్రతిపాదించారు. పంచాయతీ తరహాలోనే రిజర్వేషన్లు ఖరారు చేశారు. సీఎం ఆమోదిస్తే ఈ నెల 25లోపు షెడ్యూల్ విడుదల, JANలో ఎన్నికలు పూర్తి చేసేలా ప్లాన్ చేసినట్లు సమాచారం.
News December 17, 2025
మధ్యతరగతికి ‘వెండి’ వెలుగులు

ప్రస్తుతం బంగారం ధరలు అందనంత ఎత్తులో ఉన్నాయి. దీంతో ఈ రోజుల్లో పేద, మధ్యతరగతి వారికి వెండి పెట్టుబడి మంచి అవకాశంగా మారింది. కిలో వెండి ధర ఒక్కరోజే <<18588447>>రూ.11 వేలు పెరిగి<<>> రూ.2,22,000కు చేరి మార్కెట్ను ఆశ్చర్యపరిచింది. రాబోయే రోజుల్లో సిల్వర్ ధరలు మరింత ఎగబాకే అవకాశముందని నిపుణులు చెబుతున్నారు. బంగారంతో పోలిస్తే అందుబాటు ధరలో ఉన్న వెండిని కొనుగోలు చేయడం ఉత్తమమని సూచిస్తున్నారు.
News December 17, 2025
NLG: ‘లెక్కలు చెప్పాల్సిందే..! లేదంటే వేటు తప్పదు’

జిల్లాలో తొలి, మలి విడతల్లో నిర్వహించిన ఎన్నికల్లో సర్పంచ్, వార్డు మెంబర్లుగా పోటీ చేసిన అభ్యర్థులు 45 రోజుల్లోగా ఎన్నికల ఖర్చును MPDOలకు తెలియజేసి రశీదు తీసుకోవాలి. లేదంటే వేటు పడే ప్రమాదం ఉంది. ఇటీవల నిర్వహించిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు తమకు గుర్తులు కేటాయించిన నాటి నుంచి ఎన్నికల ఫలితాలు ప్రకటించే వరకు అయిన ఖర్చుల వివరాలు సమర్పించాలని ఎంపీడీవో జ్ఞానప్రకాశరావు తెలిపారు.


