News February 2, 2025
MNCL: రోజూ 2.6లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి చేయాలి: CMD
పెరుగుతున్న విద్యుత్ అవసరాల దృష్ట్యా థర్మల్ విద్యుత్ కేంద్రాలకు ప్రతిరోజు 2.6లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి, రవాణా చేయాలని సంస్థ CMD బలరాం ఆదేశించారు. శనివారం అన్ని ఏరియాల GMలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. రోజుకు 11రేకులకు తగ్గకుండా బొగ్గు సరఫరా చేయాలన్నారు. బొగ్గు ఉత్పత్తి సాధనలో నాణ్యతకు, రక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు.
Similar News
News February 2, 2025
SKLM: రథసప్తమికి దర్శన టికెట్ల ఇచ్చే ప్రదేశాలు ఇవే .!
రథసప్తమి సందర్భంగా దర్శన టికెట్లను అందుబాటులో ఉంచామని జిల్లా రెవెన్యూ అధికారి తెలిపారు. రూ.100 దర్శన టికెట్లు: అరసవల్లి దేవాలయ ప్రాంగణంలోని కౌంటర్లో లభిస్తాయి. అరసవల్లి దేవాలయ ప్రాంగణంలోని కౌంటర్లోనే రూ.100 దర్శన టికెట్లు, రూ.300 దర్శన టికెట్లు, రూ. 500 క్షీరాభిషేకం టికెట్లు(ఇద్దరికి దర్శన అవకాశం) లభించనున్నాయన్నారు
News February 2, 2025
ఎల్లారెడ్డిపేట: కుటుంబ కలహాలతో ఓ వ్యక్తి ఉరివేసుకుని ఆత్మహత్య
ఎల్లారెడ్డిపేట మండల కేంద్రానికి చెందిన ఓ వ్యక్తి కుటుంబ కలహాలతో బాధపడుతూ ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన శనివారం జరిగింది. స్థానికుల వివరాల ప్రకారం.. కోనేటి మల్లయ్య(43) అనే వ్యక్తి భార్య అంజవ్వతో గొడవపడ్డాడు. దీంతో భార్య, కూతురు శైలజ, కుమారుడు రాజులు తల్లిగారింటికి వెళ్లిపోయారు. తీవ్ర మనస్థాపానికి గురైన మల్లయ్య ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. పూర్తి వివరాలు తెలియల్సి ఉంది.
News February 2, 2025
సంగారెడ్డి: రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి
రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి చెందిన ఘటన మేడ్చల్ PS పరిధిలో జరిగింది. వివరాలు.. సంగారెడ్డి జిల్లా గుమ్మడిదలకు చెందిన శంకర్ గుప్త, చిట్కూల్కు చెందిన సురేశ్ గుప్త కుటుంబ సమేతంగా శ్రీశైలం వెళ్లి స్వగ్రామానికి వస్తున్నారు. శనివారం అర్ధరాత్రి మేడ్చల్ PS పరిధిలో కంటెయినర్ను కారు ఢీకొంది. దీంతో డ్రైవర్ నర్సింహా(28), శంకర్ (46), సురేశ్(45) అక్కడికక్కడే మృతి చెందారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.