News February 6, 2025

MNCL: సింగరేణిలో డిపెండెంట్లకు శుభవార్త

image

సింగరేణి కంపెనీలో డిపెండెంట్ల వయస్సు 35 నుంచి 40 సంవత్సరాలకు పెంచుతూ యాజమాన్యం ఉత్తర్వులు జారీ చేసింది. సంస్థలో పనిచేస్తూ మృతి చెందడంతో పాటు మెడికల్ అన్ ఫిట్ అయిన ఉద్యోగుల వారసులకు 2018 మార్చి 9 నుంచి ఈ గరిష్ట వయోపరిమితి సడలింపు స్కీమ్‌ వర్తించనుంది. దీనివల్ల 2018 నుంచి ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారికి తక్షణ ప్రయోజనం చేకూరనుండగా రానున్న రోజుల్లోనూ మరింత మందికి లబ్ధి చేకూరుతుంది.

Similar News

News February 6, 2025

విజయవాడ: డిజిటల్ అరెస్టుతో భారీ మోసం 

image

డిజిటల్ అరెస్ట్ పేరుతో ఓ వ్యక్తి నుంచి సైబర్ నేరగాళ్లు రూ.1.48 కోట్లు దోచేశారు. భారతీ నగర్‌కు చెందిన ఓ ఉద్యోగి నుంచి సైబర్ నేరగాళ్లు మీపై కేసు నమోదైందంటూ ఆ వ్యక్తి నుంచి రూ.3.46 లక్షలు ఓసారి, రూ.కోటి మరోసారి, ఆ తర్వాత రూ.25 లక్షలు, రూ.2 లక్షలు, రూ.20 లక్షలు జమ చేయించుకున్నారు. దీంతో బాధితుడు బుధవారం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. నగదు BNGLR, HYD, KOLAKATAలలో బ్యాంకుల్లోకి వెళ్లినట్లు తేలింది. 

News February 6, 2025

నల్గొండ: శుభకార్యాలకు అద్దెకు ఆర్టీసీ బస్సులు

image

TGS RTC నల్గొండ రీజియన్‌లోని అన్ని డిపోలలో వివాహాది శుభకార్యాలకు అద్దె ప్రాతిపదికన బస్సులు అందజేస్తామని ఉమ్మడి నల్గొండ జిల్లా రీజనల్ మేనేజర్ కె. జానీ రెడ్డి తెలిపారు. పల్లె వెలుగు, ఎక్స్ ప్రెస్, డీలక్స్, సూపర్ లగ్జరీ బస్సులను అద్దెకు తీసుకోవచ్చున్నారు. ప్రతి కిలోమీటర్‌పై గతంలో కంటే రూ.7 తగ్గింపు ఉందని, 6 గంటల వెయిటింగ్ చార్జ్ మినహాయింపు ఉంటుందన్నారు. వివరాలకు సమీప డిపోలను సంప్రదించాలని సూచించారు.

News February 6, 2025

ఆదిలాబాద్: రెండో భార్యను చంపిన భర్త

image

అనుమానంతో వ్యక్తి రెండో భార్యను హత్యచేశాడు. ఈఘటన ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ మండలం భీంపూర్‌లో జరిగింది. పోలీసుల ప్రకారం.. గ్రామానికి చెందిన మరోతికి ఇద్దరు భార్యలు. ఈక్రమంలో రెండో భార్య అయిన రుక్కుబాయికి వివాహేత సంబంధం ఉందని అనుమానం పెట్టుకున్నాడు. మద్యం తాగి వచ్చి గొడవ చేసేవాడు, చంపేస్తానని బెదిరించేవాడు. దీంతో మంగళవారం రుక్కుబాయి(26) ఛాతిపై బండతో కొట్టి హత్య చేశాడు. కేసు నమోదైంది.

error: Content is protected !!