News April 7, 2025
MNCL:GOOD NEWS.. 7 నుంచి కంటి పరీక్షలు

ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ నెల 7వ తేదీ నుంచి అంగన్వాడీ కేంద్రాల్లో ఆరేళ్ల లోపుచిన్నారులకు కంటి పరీక్షలు నిర్వహించనున్నట్లు మంచిర్యాల జిల్లావైద్యారోగ్యశాఖ అధికారి డా.హరీశ్ రాజ్ తెలిపారు. జిల్లావ్యాప్తంగా 8 ఆర్బీఎస్కే బృందాలతో 37, 920 మంది పిల్లలకు కంటి పరీక్షలు నిర్వహించడం జరుగుతుందని పేర్కొన్నారు. ఇందుకు సంబంధించి ప్రణాళికలు సిద్ధం చేసినట్లు ఆయన వెల్లడించారు.
Similar News
News April 19, 2025
గొల్లప్రోలు: జోడెడ్ల బండిపై జోడిగా పెళ్లికి

పెళ్లంటే వధూవరులు ఇద్దరు కారులో వెళ్లటం సహజమే. కానీ కాకినాడ జిల్లా గొల్లప్రోలులో పెళ్లికుమార్తె, పెళ్లికొడుకు జోడెడ్ల బండిపై జోడిగా వచ్చిన ఫొటో వైరల్ అవుతుంది. ఈ మధ్యకాలంలో వివాహం చేసుకునే వారు గుర్రపు బండ్లపై ఊరేగింపుగా వస్తూ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నారు. అదే విధంగా గొల్లప్రోలుకి చెందిన దీపిక కాకినాడకు చెందిన సాయి మనోజ్లు వినూత్నంగా జోడెడ్ల బండిపై ఊరేగింపుగా కళ్యాణ మండపానికి వచ్చారు.
News April 19, 2025
అనుకోకుండా బుల్లెట్ తగిలి ఇండియన్ స్టూడెంట్ స్పాట్ డెడ్

కెనడాలో జరిగిన కాల్పుల్లో ఓ భారత విద్యార్థిని దుర్మరణం పాలయ్యారు. హామిల్టన్లోని మొహాక్ కాలేజీలో చదువుతున్న హర్సిమ్రత్ రంధవా ఒంటారియోలోని ఓ బస్టాప్ వద్ద ఉన్నారు. ఈ క్రమంలో కారులో వచ్చిన ఓ వ్యక్తి మరో వాహనంలోని వ్యక్తిపై కాల్పులు జరిపాడు. కానీ ఓ బుల్లెట్ మిస్సై హర్సిమ్రత్ శరీరంలోకి దూసుకెళ్లింది. దీంతో ఆమె అక్కడికక్కడే దుర్మరణం చెందారు. ఈ ఘటనలో పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి విచారిస్తున్నారు.
News April 19, 2025
నాగర్కర్నూల్: నీ సీఎం కుర్చీ గుంజేస్తాం రేవంత్ రెడ్డి: తీన్మార్ మల్లన్న

నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో బీసీ చైతన్య సభను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ముఖ్యఅతిథిగా ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న హాజరయ్యారు. SLBCలో చనిపోయిన వారిలో ఏడుగురు బీసీలకు ఆయన నివాళులర్పించారు. మల్లన్న మాట్లాడుతూ.. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ ఇవ్వకుండా నోటిఫికేషన్లకు వెళ్తే ఊరుకోబోమని, రేవంత్ రెడ్డి సీఎం కుర్చీని గుంజేస్తామంటూ హెచ్చరించారు. రాష్ట్ర బీసీ నాయకులు పాల్గొన్నారు.