News December 18, 2024
మొబీక్విక్ జాక్పాట్: 58% ప్రీమియంతో లిస్టైన షేర్లు

ఇన్వెస్టర్లు ఆసక్తిగా ఎదురుచూస్తున్న మొబీక్విక్, విశాల్ మెగామార్ట్ షేర్లు NSE, BSEల్లో లిస్ట్ అయ్యాయి. IPO ధర రూ.279తో వచ్చిన మొబీక్విక్ షేర్లు BSEలో రూ.58.5% ప్రీమియంతో రూ.442, NSEలో 57.7% ప్రీమియంతో రూ.440 వద్ద నమోదయ్యాయి. ప్రస్తుతం రూ.72 లాభంతో రూ.512 వద్ద ట్రేడవుతున్నాయి. రూ.78 IPO ధరతో వచ్చిన విశాల్ షేర్లు NSEలో రూ.104 వద్ద లిస్టయ్యాయి. ఇప్పుడు 2.46% లాభంతో రూ.106 వద్ద చలిస్తున్నాయి.
Similar News
News October 28, 2025
మొంథా తుఫాన్.. వాహనదారులకు బిగ్ అలర్ట్

AP: మొంథా తీవ్ర తుఫాన్ నేపథ్యంలో భారీ వాహనదారులకు రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ కీలక హెచ్చరిక జారీ చేసింది. జాతీయ రహదారుల్లో ప్రయాణించే భారీ వాహనాలను రాత్రి 7 గంటల తర్వాత నిలిపివేయనున్నట్లు ప్రకటించింది. వాహనదారులు ముందే సురక్షిత ‘లేబే’ల్లో వాటిని పార్క్ చేసుకోవాలని సూచించింది. అటు ప్రజలు అత్యవసరమైతే తప్ప ప్రయాణాలు చేయవద్దని మరోసారి హెచ్చరించింది.
News October 28, 2025
‘ChatGPT Go’ ఏడాది పాటు ఉచితం!

ఇండియన్ యూజర్లను ఆకర్షించేందుకు ChatGPT కీలక నిర్ణయం తీసుకుంది. ‘ChatGPT Go’ సేవలను ఏడాది పాటు ఉచితంగా అందించేందుకు సిద్ధమైంది. నవంబర్ 4 నుంచి SignUp చేసిన కొత్త యూజర్లకు ఈ అవకాశం లభిస్తుందని సంస్థ వెల్లడించింది. ప్రస్తుతం ChatGPT Go ఉపయోగిస్తున్న వారికి కూడా అదనంగా 12 నెలల ఉచిత సేవలు వర్తిస్తాయని తెలిపింది. ఇప్పటికే ఎయిర్టెల్ కూడా తన యూజర్లకు ఏడాది పాటు ‘Perplexity Pro’ని ఫ్రీగా అందించింది.
News October 28, 2025
ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ

TG: మొంథా తుఫాను ఎఫెక్ట్ రాష్ట్రంలోనూ కనిపిస్తోంది. ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాలకు HYD వాతావరణ కేంద్రం రెడ్ అలర్ట్ జారీ చేసింది. అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది. పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ జిల్లాల్లో భారీ వర్షం కురిసే అవకాశమున్నట్లు పేర్కొంది. ఈ జిల్లాల్లో గంటకు 40-50 కి.మీ. వేగంతో గాలులు వీచే ఛాన్సుందని తెలిపింది.


