News June 29, 2024

మొబైల్ నంబర్ పోర్టింగ్.. జులై 1 నుంచి కొత్త రూల్

image

సిమ్ స్వాప్ లేదా మార్పిడి తర్వాత మొబైల్ నంబర్ పోర్టింగ్‌‌ సమయాన్ని ట్రాయ్ వారం రోజులకు కుదించింది. ఈ నిబంధన జులై 1 నుంచి అమల్లోకి రానుంది. గతంలో ఇది 10 రోజులుగా ఉండేది. ఇకపై 7 రోజుల్లోగా నంబర్ మార్చుకునేందుకు UPC కేటాయించనుంది. సుదీర్ఘ నిరీక్షణ వల్ల యూజర్లకు ఇబ్బందులు ఎదురవుతున్నాయన్న ఫిర్యాదుల నేపథ్యంలో ట్రాయ్ ఈ నిర్ణయం తీసుకుంది. అయితే దీన్ని 2-3 రోజులకు తగ్గించాలనే వినతులూ వస్తున్నాయి.

Similar News

News October 23, 2025

డిగ్రీ అర్హతతో 348 పోస్టులు

image

ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్(IPPB)లో 348 GDS ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలకు దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతోంది. APలో 8, TGలో 9 పోస్టులున్నాయి. డిగ్రీ ఉత్తీర్ణత సాధించి, 20-35 ఏళ్ల వయసున్న వారు అర్హులు. అప్లై చేసుకోవడానికి ఈ నెల 29 చివరి తేదీ. దరఖాస్తు ఫీజు రూ.750. విద్యార్హతల్లో మెరిట్, రాతపరీక్ష ఆధారంగా ఎంపిక ఉంటుంది. వెబ్‌సైట్: https://www.ippbonline.com/

News October 23, 2025

లేటెస్ట్ మూవీ అప్డేట్స్!

image

* రెబల్ స్టార్ ప్రభాస్ బర్త్ డే సందర్భంగా మారుతి తెరకెక్కిస్తోన్న ‘రాజాసాబ్’ నుంచి స్పెషల్ పోస్టర్ రిలీజైంది. త్వరలోనే ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేస్తామని మేకర్స్ ప్రకటించారు.
* ప్రదీప్ రంగనాథన్ హీరోగా నటించిన ‘డూడ్’ సినిమా రూ.100 కోట్ల క్లబ్‌లోకి ప్రవేశించింది. ఈనెల 17న ఈ చిత్రం రిలీజవగా వారం రోజుల్లోనే రూ.100 కోట్లు కలెక్ట్ చేయడం విశేషం.

News October 23, 2025

కరప్షన్, క్రైమ్.. ఇవే NDA డబుల్ ఇంజిన్లు: తేజస్వీ

image

ఎన్డీయే ప్రభుత్వాన్ని పడగొట్టడానికి కలిసి పని చేస్తామని ఆర్జేడీ నేత, మహాఘట్‌బంధన్ <<18080695>>సీఎం అభ్యర్థి<<>> తేజస్వీ యాదవ్ అన్నారు. డబుల్ ఇంజిన్ సర్కారులో ఒక ఇంజిన్ కరప్షన్, మరోది క్రైమ్ అని ఎద్దేవా చేశారు. బిహార్‌లో నేరాలు పెరిగిపోతున్నాయని, 200 రౌండ్ల కాల్పులు జరగని రోజంటూ లేదని అన్నారు. కొత్త బిహార్ నిర్మాణానికి కృషి చేస్తామని చెప్పారు. NDA సీఎం అభ్యర్థి ఎవరో BJP, అమిత్ షా క్లారిటీ ఇవ్వాలన్నారు.