News February 25, 2025

మోడల్ స్కూల్ దరఖాస్తుల గడువు పెంపు

image

TG: మోడల్ స్కూళ్ల దరఖాస్తు గడువును మార్చి10వ వరకు పెంచినట్లు విద్యాశాఖ తెలిపింది. ఈనెల 28వ తేదీతో గడువు ముగుస్తుండగా మార్చి10 వరకు పొడిగిస్తున్నట్లు ప్రభుత్వం GO జారీ చేసింది. మోడల్ స్కూళ్లలో 6 నుంచి 10తరగతుల ప్రవేశాలకు దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. ఫీజు ఓసీలు రూ.200, ఇతర వర్గాల వారు రూ.125 చెల్లించాల్సి ఉంటుంది. సైట్: https://telanganams.cgg.gov.in/

Similar News

News November 6, 2025

ఆరోగ్యాన్ని దెబ్బతీసే మద్యంపై వైద్యుడి ఇంట్రెస్టింగ్ ట్వీట్!

image

ఆనందం, సరదా కోసం ఆల్కహాల్ తీసుకుంటే కలిగే అనర్థాలను వివరిస్తూ వైద్యుడు శ్రీకాంత్ మిర్యాల చేసిన ట్వీట్ వైరలవుతోంది. ‘బాధలో బీరు తాగితే బోన్ మ్యారో దెబ్బతింటుంది. స్కాచ్ తాగితే సిర్రోసిస్‌తో రక్తం కక్కుకుని చనిపోతారు. రమ్ సేవిస్తే రక్తహీనత వస్తుంది. సారా తాగితే సరసానికి పనికిరాకుండా పోతారు. వోడ్కా వల్ల గవదలు వాచిపోతాయి. వైన్ తాగితే గర్భస్రావాలు. మందు మానరా.. మనిషివయ్యేవు’ అని ఆయన సందేశమిచ్చారు.

News November 6, 2025

పరకామణి కేసుపై సమగ్ర దర్యాప్తు: రవిశంకర్

image

AP: తిరుమలలో పరకామణి <<18117294>>చోరీ కేసుపై<<>> హైకోర్టు ఆదేశాలతో సమగ్ర దర్యాప్తు చేస్తున్నామని CID DG రవిశంకర్ అయ్యన్నార్ వెల్లడించారు. ఇప్పటికే పరకామణి భవనం, CCTV కమాండ్ కంట్రోల్ సెంటర్‌, చోరీ దృశ్యాలను పరిశీలించామన్నారు. నిందితుడు రవికుమార్‌కు తమిళనాడు, కర్ణాటక, HYD, తిరుపతిలో ఆస్తులున్నట్లు గుర్తించామని చెప్పారు. ఈ కేసుపై DEC 2న హైకోర్టుకు నివేదిస్తామని తెలిపారు.

News November 6, 2025

ఆ కప్పు టీకి భారీ మూల్యం: పాక్ Dy. PM

image

తాలిబన్స్‌తో ఓ టీ మీట్‌తో భారీ మూల్యం చెల్లిస్తున్నామని పాక్ Dy.PM ఇషాక్ దార్ అన్నారు. 2021లో తాలిబన్లు అధికారం పొందాక ISI మాజీ చీఫ్ హమీద్ ఆ దేశంలో పర్యటించి వారితో టీ తాగుతూ అంతా బాగుంటుందని భరోసా ఇచ్చారని విమర్శించారు. దీంతోనే PAK-AFG బార్డర్స్ తెరుచుకోగా వర్తకులతో పాటు వేలాది తాలిబన్స్ పాక్‌లోకి వచ్చారన్నారు. వారితో పాక్‌లోని మిలిటెంట్ గ్రూప్స్ రీ యాక్టివేట్ అయి తమపై బుసకొడుతున్నాయని వాపోయారు.