News March 24, 2025
పార్లమెంటులో ‘ఛావా’ చూడనున్న మోదీ, కేంద్ర మంత్రులు!

ఛత్రపతి శంభాజీ మహారాజ్ జీవితం ఆధారంగా వచ్చిన చిత్రం ‘ఛావా’. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ సూపర్ డూపర్ హిట్ సినిమాను త్వరలో పార్లమెంటులో ప్రదర్శిస్తారని తెలిసింది. ఈ స్క్రీనింగ్కు ప్రధాని నరేంద్రమోదీ, కేంద్ర మంత్రులు, ఎంపీలు హాజరవుతారని సమాచారం. నటుడు విక్కీ కౌశల్, క్యాస్ట్ అండ్ క్రూ వస్తారని తెలుస్తోంది. స్క్రీనింగ్ తేదీపై స్పష్టత రావాల్సి ఉంది.
Similar News
News March 26, 2025
‘అంతరిక్ష వ్యవసాయం’

స్పేస్లో జరుగుతున్న పరిశోధనల్లో ఇదీ ఒకటి. ISSకు వెళ్లే వ్యోమగాములకు సరిపడా ఆహారాన్ని ప్రాసెస్డ్ చేసి పంపిస్తుంటారు. అక్కడే వ్యవసాయం చేసుకోగలిగితే వారు స్వయంగా తమ ఆహారాన్ని ఉత్పత్తి చేసుకోగలుగుతారని ఈ పరిశోధన ఉద్దేశం. అలాగే ఆ మొక్కల నుంచి స్పేస్లో ఆక్సిజన్ వెలువడుతుంది. అయితే, స్పేస్లో సూర్యరశ్మి, నీరు, ఆక్సిజన్, భూమి లేనప్పటికీ అక్కడ మొక్కలు వేగంగా పెరుగుతున్నట్లు సైంటిస్టులు చెబుతున్నారు.
News March 26, 2025
365 రోజుల్లో ‘ది ప్యారడైజ్’

నేచురల్ స్టార్ నాని హీరోగా శ్రీకాంత్ ఓదెల తెరకెక్కిస్తోన్న ‘ది ప్యారడైజ్’ సినిమా వచ్చే ఏడాది ఇదే రోజున విడుదల కానుంది. ఇంకా 365రోజులు అంటూ నాని ఓ పోస్టర్ను Xలో షేర్ చేశారు. ఇప్పటికే రిలీజైన టైటిల్ గ్లింప్స్ సినిమాపై భారీ అంచనాలను పెంచేసింది. ఈ చిత్రానికి అనిరుధ్ మ్యూజిక్ అందిస్తున్నారు. కాగా నాని- శ్రీకాంత్ కాంబోలో వచ్చిన ‘దసరా’ మూవీ బ్లాక్ బస్టర్గా నిలిచిన విషయం తెలిసిందే.
News March 26, 2025
గర్భిణుల పథకానికి నిధులు ఏవి: సోనియా గాంధీ

గర్భిణులకు ఇచ్చే మాతృత్వ ప్రయోజనాల పథకానికి కేంద్రం పూర్తి నిధులు కేటాయించలేదని ఎంపీ సోనియా గాంధీ ఆరోపించారు. ఈ స్కీమ్కు రూ.12,000కోట్లు అవసరం కాగా కేవలం రూ.2,500 కోట్లు మాత్రమే కేటాయించిందని తెలిపారు. 2022-23లో 68శాతం మంది ఒక విడత డబ్బులు తీసుకోగా ఆ తరువాతి సంవత్సరంలో ఆ సంఖ్య 12శాతానికి తగ్గిందన్నారు. జాతీయ ఆహర భద్రత పథకం కింద కేంద్రం రెండు విడతలలో గర్భిణులకు రూ.6వేలు ఇస్తుంది.