News October 28, 2024
ఓబీసీలను మోదీ వంచించారు: కాంగ్రెస్
కులగణనకు అంగీకరించకుండా OBCలను ప్రధాని మోదీ వంచించారని కాంగ్రెస్ విమర్శించింది. వచ్చే ఏడాది జనగణనకు సిద్ధమైన కేంద్రం కులగణనను విస్మరించడాన్ని ప్రధాన విపక్షం తప్పుబట్టింది. ఈ విషయంలో NDA ప్రభుత్వాన్ని ఆపుతున్నదేంటని ప్రశ్నించింది. మోదీ తన రాజకీయ అహంకారంతో కులగణనను పక్కనపెట్టారంది. దీనిపై NDA మిత్రపక్షాలైన JDU, TDPల వైఖరేంటో చెప్పాలని డిమాండ్ చేసింది.
Similar News
News October 28, 2024
యంగ్ ప్లేయర్లకు IPLపైనే ఎక్కువ ఇంట్రస్ట్: MSK
భారత క్రికెట్ భవిష్యత్తుపై BCCI మాజీ సెలక్టర్ MSK ప్రసాద్ ఆందోళన వ్యక్తం చేశారు. యువ ఆటగాళ్లలో చాలా మంది దేశానికి ఆడేకంటే IPL ఆడేందుకే ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. ‘IPLతో ప్లేయర్ల మైండ్సెట్ మారింది. అన్ని ఫార్మాట్లలో దూకుడుగా ఆడేస్తున్నారు. స్పిన్, స్వింగ్ను ఆడే నైపుణ్యాన్ని కోల్పోతున్నారు. ఒకప్పుడు సచిన్, గంగూలీ వంటి వారు ఫార్మాట్కు తగ్గట్లు ఆడేవారు’ అని పేర్కొన్నారు.
News October 28, 2024
సూపర్ న్యూస్.. కృష్ణుడి పాత్రలో మహేశ్ బాబు?
సూపర్ స్టార్ మహేశ్ బాబు ఫ్యాన్స్కు గుడ్ న్యూస్. రాజమౌళితో మూవీ షూటింగ్ ఇంకా మొదలు కాకపోగా ‘దేవకీ నందన వాసుదేవ’ సినిమాలో ఆయన అతిథి పాత్రలో కనిపిస్తారని తెలుస్తోంది. ఆయన మేనల్లుడు గల్లా అశోక్ హీరోగా నటించిన చిత్రంలో క్లైమాక్స్లో కృష్ణుడిగా కనిపిస్తారని నెట్టింట చర్చ జరుగుతోంది. ఈ సినిమాకు ‘హనుమాన్’ దర్శకుడు ప్రశాంత్ వర్మ కథను అందించడం గమనార్హం. కాగా మహేశ్ పాత్రపై త్వరలోనే అధికారిక ప్రకటన రానుంది.
News October 28, 2024
నాలుగు నెలల్లో రూ.47 వేల కోట్ల అప్పు: పేర్ని నాని
AP: సంపద సృష్టిస్తానని అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాలుగు నెలల్లోనే రూ.47 వేల కోట్ల అప్పులు చేశారని మాజీ మంత్రి పేర్ని నాని ఆరోపించారు. జగన్ సృష్టించిన సంపదను కూడా తన వారికి ఇచ్చేస్తున్నారని విమర్శించారు. ప్రజలపై రూ.6.072 కోట్ల కరెంటు ఛార్జీల భారం మోపారని దుయ్యబట్టారు. చంద్రబాబు పాలనలో ఇసుక బంగారంతో సమానంగా మారిందని అన్నారు.