News December 24, 2024
బడ్జెట్పై ఆర్థికవేత్తలతో మోదీ సమాలోచనలు

కేంద్ర బడ్జెట్లో పొందుపరచాల్సిన అంశాలు, కేటాయింపులపై సలహాలు, సూచనలు తీసుకొనేందుకు ఆర్థికవేత్తలు, భిన్న రంగాల నిపుణులతో ప్రధాని మోదీ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. Feb 1న నిర్మలా సీతారామన్ 2025-26 వార్షిక బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు. Niti Aayog Vice-Chairman సుమన్ బేరీ, CEO సుబ్రహ్మణ్యం, Chief Economic Advisor అనంత నాగేశ్వరన్, ఆర్థికవేత్త సుర్జిత్ భల్లా తదితరులు పాల్గొన్నారు.
Similar News
News October 27, 2025
చిరంజీవి సినిమాలో కార్తీ!

చిరంజీవితో డైరెక్టర్ బాబీ తెరకెక్కించనున్న సినిమాలో హీరో కార్తీ నటించనున్నట్లు తెలుస్తోంది. బాబీ చెప్పిన గ్యాంగ్స్టర్ కథకు కార్తీ ఓకే చెప్పారని, త్వరలోనే సినిమాను పట్టాలెక్కించి 2027 సంక్రాంతి బరిలో దించాలని చూస్తున్నట్లు టాక్. హీరోయిన్గా మాళవిక మోహనన్, రాశీ ఖన్నాను పరిశీలిస్తున్నట్లు సమాచారం. కేవీఎన్ నిర్మాణ సంస్థ ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులు ప్రారంభించినట్లు టీటౌన్ వర్గాలు చెబుతున్నాయి.
News October 27, 2025
CSIR-CCMBలో ఉద్యోగాలు

హైదరాబాద్లోని CSIR-సెంటర్ ఫర్ సెల్యూలర్ అండ్ మాలిక్యులర్ బయాలజీ 4 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. సైంటిస్ట్, సీనియర్ సైంటిస్ట్ పోస్టులు ఉన్నాయి. అక్టోబర్ 29 నుంచి దరఖాస్తులు ప్రారంభం కానుండగా.. నవంబర్ 20 వరకు అప్లై చేసుకోవచ్చు. దరఖాస్తు హార్డ్ కాపీని నవంబర్ 28 వరకు స్పీడ్ పోస్ట్ చేయాలి. వెబ్సైట్: https://www.ccmb.res.in/
News October 27, 2025
కాస్త రిలీఫ్.. తగ్గిన బంగారం ధరలు

బులియన్ మార్కెట్లో ఇవాళ బంగారం ధరలు తగ్గాయి. 24 క్యారెట్ల 10 గ్రా. గోల్డ్ రేట్ రూ.1,140 తగ్గి రూ.1,24,480కి చేరింది. 22 క్యారెట్ల 10 గ్రా. పసిడి ధర రూ.1,050 దిగివచ్చి రూ.1,14,100గా ఉంది. ఇటీవల ఆకాశమే హద్దుగా దూసుకెళ్తున్న బంగారం ధరలు కాస్త తగ్గడంతో కొనుగోలుదారులకు ఊరట లభించింది. అటు రేట్లు తగ్గడంపై పెట్టుబడిదారులు నిరాశకు గురవుతున్నారు. మరోవైపు వెండి ధరలు స్థిరంగా ఉన్నాయి. కేజీ రూ.1,70,000గా ఉంది.


