News April 8, 2024

మోదీ గెలవాలని వేలు కట్ చేసుకున్నాడు

image

ప్రధాని మోదీ మూడోసారి గెలవాలని ఆకాంక్షిస్తూ అరుణ్ అనే వ్యక్తి తన చూపుడు వేలును కాళీమాతకు బలిదానం ఇచ్చాడు. ఆ తర్వాత రక్తంతో ఆలయ గోడలపై.. ‘మోదీ అందరికన్నా గొప్పవారు. నువ్వు ఆయనను గెలిపించాలి కాళీమాత’ అని రాశాడు. ఈ ఘటన కర్ణాటకలో జరిగింది. అతను తన ఇంట్లోనే మోదీకి గుడి కట్టి రోజూ పూజలు చేస్తున్నాడు. కాగా నాయకులపై అభిమానంతో శరీరాలను గాయపరచుకునే పిచ్చి పనులు చేయొద్దని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

Similar News

News January 15, 2026

మృణాల్, ధనుశ్ పెళ్లంటూ ప్రచారం!

image

తమిళ హీరో ధనుష్, హీరోయిన్ మృణాల్ ఠాకూర్ పెళ్లి చేసుకోనున్నట్లు మరోసారి ప్రచారం జరుగుతోంది. ఫిబ్రవరి 14(ప్రేమికుల రోజు)న వీరిద్దరూ వివాహ జీవితంలోకి అడుగుపెడతారని దాని సారాంశం. అతికొద్ది మంది స్నేహితులు, సన్నిహితుల సమక్షంలో వీరు ఒక్కటి కానున్నారని తెలుస్తోంది. గతంలోనూ వీరు ప్రేమలో ఉన్నారని ప్రచారం జరగ్గా మృణాల్ ఖండించారు. అయితే తాజా ప్రచారంపై ధనుశ్, మృణాల్ ఇప్పటివరకూ ఎలాంటి ప్రకటన చేయలేదు.

News January 15, 2026

కోకాకోలా $1B ఐపీఓ? క్లారిటీ ఇచ్చిన కంపెనీ

image

హిందుస్థాన్ కోకాకోలా బెవరేజెస్ (HCCB) IPOపై వస్తున్న వార్తలను ఆ కంపెనీ తోసిపుచ్చింది. ఈ వేసవిలో లేదా సమీప భవిష్యత్తులో అలాంటి ప్లాన్స్ ఏమీ లేవని సంస్థ ప్రతినిధి క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుతం తాము కేవలం మార్కెట్‌లో పట్టు సాధించడం, వినియోగదారులకు నాణ్యమైన సేవలు అందించడంపైనే ఫోకస్ పెట్టామన్నారు. GST వల్ల లభించిన ధరల ప్రయోజనాలను కస్టమర్లకు బదిలీ చేస్తున్నామని తెలిపారు. IPO వార్తలన్నీ ఊహాగానాలేనన్నారు.

News January 15, 2026

దేశ భద్రత విషయంలో ముందుంటాం: CM

image

TGలో మరో సైనిక్ స్కూల్ ఏర్పాటు చేయాలని ఆర్మీ అధికారులను CM రేవంత్ కోరారు. పదేళ్లుగా ఒక్క స్కూలును కూడా మంజూరు చేయలేదన్నారు. సదరన్ కమాండ్ సెంటర్ ప్రధాన కార్యాలయాన్ని HYDకు మార్చే అంశాన్ని పరిశీలించాలని కోరారు. దేశ భద్రత అంశాల్లో సహకరించడంలో TG సర్కార్ ముందుంటుందని, లో ఫ్రీక్వెన్సీ నేవీ రాడార్ స్టేషన్‌కు VKDలో 3వేల ఎకరాలు కేటాయించినట్లు HYDలో జరిగిన సివిల్ మిలిటరీ లైజన్ కాన్ఫరెన్స్‌లో గుర్తుచేశారు.