News March 26, 2024
సీఏఏతో మోదీ సర్కార్ కుట్ర: కేరళ సీఎం

ముస్లింలను రెండో శ్రేణి పౌరులుగా మార్చాలని పౌరసత్వ సవరణ చట్టం(CAA) ద్వారా బీజేపీ కుట్ర పన్నుతోందని కేరళ CM పినరయి విజయన్ మండిపడ్డారు. ‘ముస్లిం పాలకులు, సాంస్కృతిక సారథులు ఎందరో దేశ చరిత్ర, స్వాతంత్ర్య పోరాటంలో పాలు పంచుకున్నారు. వాస్తవానికి భారత్ మాతాకీ జై, జైహింద్ అని నినదించింది ముస్లింలని సంఘ్ పరివార్కి తెలియదనుకుంటా. CAAకి వ్యతిరేకంగా పోరాడాలనే ఉద్దేశం కాంగ్రెస్కు లేదు’ అని ఫైర్ అయ్యారు.
Similar News
News November 2, 2025
రైల్టెల్ కార్పొరేషన్ లిమిటెడ్లో ఉద్యోగాలు

<
News November 2, 2025
వీళ్లు తీర్థయాత్రలు వెళ్లాల్సిన పని లేదు

కార్తీక వ్రత మహత్యం చాలా గొప్పదని పండితులు చెబుతున్నారు. ‘భూమ్మీదున్న పుణ్యక్షేత్రాలన్నీ కార్తీక వ్రతస్థుని శరీరమందే ఉంటాయి. ఇంద్రాదులు కూడా ఈ వ్రతస్థులను సేవిస్తారు. ఈ వ్రతాన్ని ఆచరించిన చోటు నుంచి గ్రహ, భూత పిశాచ గణాలు పారిపోతాయి. నిష్ఠగా కార్తీక వ్రతం చేసే వారి పుణ్యాన్ని చెప్పడం ఆ బ్రహ్మకే సాధ్యం కాదు. ఈ కార్తీక వ్రతాన్ని విడువక ఆచరించేవారు తీర్థయాత్రల అవసరమే లేదు’ అని అంటున్నారు. <<-se>>#Karthikam<<>>
News November 2, 2025
పరాన్నజీవులతో కోళ్లకు కలిగే ముప్పు.. నివారణ

అంతర్గత పరాన్నజీవుల వల్ల ఏలికపాములు, బద్దెపురుగులు కోళ్లను తరచూ బాధిస్తాయి. ఈ సమస్య నివారణకు వెటర్నరీ నిపుణుల సలహా మేరకు పైపరిజన్, లెవామిసోల్ మందులతో కోళ్లకు అప్పుడప్పుడు డీవార్మింగ్ చేయించాలి. బాహ్యపరాన్న జీవులైన పేలు, గోమారి, నల్లులు కోళ్లకు తీవ్ర అసౌకర్యం కలిగిస్తాయి. కోళ్లపై, షెడ్లో ఈ కీటకాలను గుర్తిస్తే వెటర్నరీ నిపుణుల సూచనతో కీటక సంహారక మందులను కోళ్లపై, షెడ్డు లోపల, బయట పిచికారీ చేయాలి.


