News March 26, 2024

సీఏఏతో మోదీ సర్కార్ కుట్ర: కేరళ సీఎం

image

ముస్లింలను రెండో శ్రేణి పౌరులుగా మార్చాలని పౌరసత్వ సవరణ చట్టం(CAA) ద్వారా బీజేపీ కుట్ర పన్నుతోందని కేరళ CM పినరయి విజయన్ మండిపడ్డారు. ‘ముస్లిం పాలకులు, సాంస్కృతిక సారథులు ఎందరో దేశ చరిత్ర, స్వాతంత్ర్య పోరాటంలో పాలు పంచుకున్నారు. వాస్తవానికి భారత్ మాతాకీ జై, జైహింద్ అని నినదించింది ముస్లింలని సంఘ్ పరివార్‌కి తెలియదనుకుంటా. CAAకి వ్యతిరేకంగా పోరాడాలనే ఉద్దేశం కాంగ్రెస్‌కు లేదు’ అని ఫైర్ అయ్యారు.

Similar News

News March 27, 2026

ఆయిల్ కంపెనీల నష్టాలను తగ్గించేందుకు పన్నులపై కోత: హర్దీప్‌సింగ్

image

క్రూడాయిల్ ధరలు నెల వ్యవధిలో బ్యారెల్ $70 నుంచి $122 వరకు పెరిగాయని కేంద్ర మంత్రి హర్దీప్‌సింగ్ వెల్లడించారు. దీనివల్ల పలు దేశాల్లో పెట్రోల్, డీజిల్ రేట్లు 20-50% పెరిగాయని తెలిపారు. అయితే PM మోదీ సామాన్యులపై భారం వేయకూడదని నిర్ణయించారన్నారు. ఆయిల్ కంపెనీలకు లీటర్ పెట్రోల్‌పై రూ.24, డీజిల్‌పై రూ.30 మేర వస్తున్న నష్టాన్ని <<19487934>>తగ్గించేందుకు<<>> ప్రభుత్వ పన్నులపై కోత విధించినట్లు Xలో పేర్కొన్నారు.

News March 27, 2026

చరణ్ బర్త్ డే.. మెగాస్టార్ ఎమోషనల్ పోస్ట్

image

రామ్ చరణ్ బర్త్ డే సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి ఎమోషనల్ ట్వీట్ చేశారు. ‘చిన్నప్పుడు నా చెయ్యి పట్టుకొని నడిచిన చరణ్ బాబు.. నేడు ఎంతోమందికి స్ఫూర్తిగా నిలిచే స్థాయికి చేరాడు’ అంటూ కొనియాడారు. సినిమా, వ్యక్తిగత జీవితం, క్రమశిక్షణ, కుటుంబం పట్ల బాధ్యతను చరణ్ నిర్వర్తించే తీరు చూస్తే గర్వంగా ఉందని కొనియాడారు. దైవబలం, అభిమానుల ప్రేమతో చరణ్ మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆకాంక్షించారు.

News March 27, 2026

30 నుంచి ‘సదరం’ వైద్య శిబిరాలు

image

AP: సదరం సర్టిఫికెట్ల కోసం రాష్ట్రవ్యాప్తంగా 57,452 మంది దరఖాస్తు చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. వీరి వైకల్య ధ్రువీకరణకు 110 ఆస్పత్రుల్లో ఈ నెల 30 నుంచి మే నెలాఖరు వరకు 80 వేల వైద్య శిబిరాలను నిర్వహించనున్నట్లు తెలిపారు. వైకల్య శాతంపై అప్పీల్ చేసుకున్నవాళ్లు తొలుత పొందిన ఐడీని సంబంధిత ఆస్పత్రుల్లో తొలగించుకోవాలని సూచించారు. ఆ తర్వాత మళ్లీ అప్లై చేసుకోవాలన్నారు.