News April 25, 2024

మోదీ గ్యారంటీ భారత్‌కు పరిమితం కాదు: జైశంకర్

image

పీఎం మోదీ ఇచ్చే గ్యారంటీ భారత్‌కు మాత్రమే పరిమితం కాదని కేంద్రమంత్రి ఎస్ జైశంకర్ పేర్కొన్నారు. హైదరాబాద్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ‘మోదీ గ్యారంటీ దేశ సరిహద్దుల వద్ద ఆగిపోదు. విదేశాల్లోని భారతీయుల భద్రత కూడా మాకు అత్యంత ముఖ్యం. కొవిడ్ అయినా, యుద్ధాలైనా మనవారిని రక్షించేందుకు మేం అన్నివేళలా సిద్ధం. గత ప్రభుత్వాల విదేశాంగ విధానం ఓటు బ్యాంకే ప్రామాణికంగా నడిచింది’ అని స్పష్టం చేశారు.

Similar News

News December 4, 2025

పెప్లమ్ బ్లౌజ్‌ని ఇలా స్టైల్ చేసేయండి

image

సాధారణంగా పెప్లమ్ టాప్స్ జీన్స్‌పైకి సూట్ అవుతాయి. కానీ దీన్ని ఎత్నిక్ వేర్‌గా ట్రై చేస్తే మోడ్రన్ టచ్ ఇస్తుంది. పెప్లమ్ టాప్స్‌ను చీరలతో స్టైల్ చేసి ట్రెండీ లుక్ సొంతం చేసుకోవచ్చు. పార్టీల్లో, ఫంక్షన్లలో అందరి దృష్టిని ఆకర్షించాలంటే, జాకెట్ స్టైల్ పెప్లమ్ బ్లౌజ్‌తో చీరను మ్యాచ్ చేస్తే సరిపోతుంది. పెప్లమ్ బ్లౌజ్ వేసుకుంటే పల్లు లోపలికి తీసుకుంటారు. ఇది చూడటానికి చాలా ఆకర్షణీయంగా కనిపిస్తుంది.

News December 4, 2025

‘అఖండ-2’ రిలీజ్ ఆపాలి: మద్రాస్ హైకోర్టు

image

‘అఖండ-2’ విడుదలను నిలిపివేయాలని మద్రాసు హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. ‘అఖండ-2’ నిర్మాణ సంస్థ 14 రీల్స్(ఇప్పుడు 14 రీల్స్ ప్లస్) తమకు రూ.28 కోట్లు ఇవ్వాల్సి ఉందని ఈరోస్ ఇంటర్నేషనల్ సంస్థ కోర్టును ఆశ్రయించింది. దీంతో సమస్య పరిష్కారం అయ్యే వరకు 14 రీల్స్ ప్లస్ సంస్థ నిర్మించిన ‘అఖండ2’ విడుదల చేయొద్దని కోర్టు ఆదేశించింది. దీనిపై నిర్మాణ సంస్థ ఎలా స్పందిస్తుందనేది వేచి చూడాలి.

News December 4, 2025

పుతిన్‌ ఇష్టపడే ఆహారం ఇదే!

image

రష్యా అధ్యక్షుడు పుతిన్ ఇవాళ భారత్‌కు రానున్నారు. ఆయన PM మోదీతో కలిసి ప్రైవేట్ డిన్నర్ చేస్తారని సమాచారం. పుతిన్ సంప్రదాయ వంటకాలను ఇష్టపడతారు. బ్రేక్‌ఫాస్ట్‌లో చీజ్, తేనె కలిపి చేసే ట్వోరోగ్ తింటారు. గుడ్లు, పండ్ల జ్యూస్ తీసుకుంటారు. చేపలు, గొర్రె మాంసం ఇష్టంగా తింటారు. షుగర్ ఫుడ్స్‌కు దూరంగా ఉంటారు. అరుదుగా ఐస్‌క్రీమ్ తీసుకుంటారు. అధికారిక డిన్నర్లలో చేపల సూప్, నాన్ వెజ్‌కు ప్రాధాన్యమిస్తారు.