News March 17, 2024

ఏపీ, తెలంగాణలో మోదీ బిజీబిజీ

image

తెలుగు రాష్ట్రాల్లో ప్రధాని మోదీ బిజీబిజీగా గడుపుతున్నారు. నిన్న నాగర్‌కర్నూల్‌ విజయ సంకల్ప సభలో పాల్గొన్న ఆయన రాత్రి HYDలోని రాజ్‌భవన్‌లో బస చేశారు. ఇవాళ సాయంత్రం మోదీ బేగంపేట ఎయిర్‌పోర్టు నుంచి ఏపీలోని గన్నవరం చేరుకుంటారు. అక్కడి నుంచి టీడీపీ-బీజేపీ-జనసేన చిలకలూరిపేటలో నిర్వహించే ప్రజాగళం సభకు హాజరవుతారు. తిరిగి రాత్రికి HYD చేరుకుంటారు. రేపు జగిత్యాలలో జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు.

Similar News

News September 29, 2024

తిరుమలలో రూ.కోటి ‘ఉదయాస్తమానసేవ’ గురించి తెలుసా?

image

AP: టీటీడీ వెబ్‌సైట్‌లో ఈ టికెట్లు అందుబాటులో ఉంటాయి. రూ.కోటితో కొనుగోలు చేస్తే రాబోయే 25 ఏళ్ల పాటు ఏడాదిలో ఏదైనా ఒక తేదీని ఎంచుకుని శ్రీవారి సేవల్లో పాల్గొనవచ్చు. సుప్రభాత సేవ, తోమాల, అర్చన, ఊంజల్ సేవ, సహస్ర కలశాభిషేకం, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకరణ లాంటి సేవలు ఉంటాయి. ఆదాయపు పన్ను సెక్షన్ 80G కింద పన్ను మినహాయింపూ పొందొచ్చు. ప్రత్యేక కాటేజీ ఉచితంగా ఇస్తారు. పూర్తి వివరాలకు <>సైట్<<>> చూడండి.

News September 29, 2024

GOOD NEWS: రైల్వేలో 14,298 ఉద్యోగాలు

image

నిరుద్యోగులకు రైల్వే శాఖ శుభవార్త చెప్పింది. 9,144 టెక్నీషియన్ పోస్టులకు మార్చిలో నోటిఫికేషన్ ఇవ్వగా, తాజాగా వాటిని పెంచింది. 40 కేటగిరీల్లో 14,298 ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. OCT 2 నుంచి 16 వరకు అప్లై చేసుకోవచ్చంది. గతంలో దరఖాస్తు చేసుకున్నవారికి ఎడిట్ ఆప్షన్‌ ఇస్తామని, కొత్త పోస్టులకూ అప్లై చేసుకోవచ్చని పేర్కొంది. పూర్తి వివరాలకు ఇక్కడ <>క్లిక్<<>> చేయండి.
వెబ్‌సైట్: rrbapply.gov.in

News September 29, 2024

రాజ్యసభ రేసులో నాగబాబు?

image

AP: ఇటీవల మోపిదేవి వెంకటరమణ, మస్తాన్‌రావు, కృష్ణయ్య రాజ్యసభ సభ్యత్వాలకు రాజీనామా చేయడంతో ఖాళీ అయిన 3 సీట్లూ NDAకే దక్కనున్నాయి. వీటిలో 2 TDP, ఒకటి JSP పంచుకుంటాయని వార్తలు వస్తున్నాయి. TDP నుంచి అశోక్ గజపతిరాజు, యనమల రామకృష్ణుడు, దేవినేని ఉమ పేర్లు ప్రముఖంగా వినిపిస్తుండగా, జనసేన నుంచి నాగబాబు రేసులో ఉన్నట్లు తెలుస్తోంది. BJP అధిష్ఠానం తమకూ ఓ సీటు అడగొచ్చని సమాచారం.